Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హైదరాబాదీలకు గుడ్‌న్యూస్… గణేష్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్

  • హైదరాబాదీలకు గుడ్‌న్యూస్
  • గణేష్ నిమజ్జనానికి పచ్చజెండా ఊపిన సుప్రీంకోర్టు
  • ఈ ఒక్క ఏడాదికి మాత్రమేనని నిబంధన

హైదరాబాద్‌ మహానగరంలో గణేష్ నిమజ్జనానికి అడ్డంకులు తొలగిపోయాయి. హుస్సేన్‌సాగర్ సహా అన్ని చెరువుల్లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేసుకోవడానికి సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. హైదరాబాద్‌ నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో గణేశ్‌ నిమజ్జనంపై ఆంక్షలు విధిస్తూ తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌చేస్తూ జీహెచ్‌ఎంసీ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యున్నత న్యాయస్థానం గురువారం విచారణ చేపట్టింది. 

దీనిపై ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం వాదనలు విన్నది. నిమజ్జనంపై హైకోర్టు ఉత్తర్వులు చివరి నిమిషంలో వెలువడినందున ఈ సంవత్సరం అందులో కొన్ని మినహాయింపులు కోరుతున్నట్లు జీహెచ్ఎంసీ ధర్మాసనానికి విన్నవించింది. హైకోర్టు ఉత్తర్వుల్లోని చాలా అంశాలకు తాము కట్టుబడి ఉంటామని, ఒకట్రెండు అంశాలను మాత్రం తక్షణం అమలు చేయలేమని పేర్కొంది. 

దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు.. హుస్సేన్‌సాగర్‌‌లో గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసుకోవచ్చని ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఆదేశాలు ఒక్క ఏడాదికి మాత్రమేనని, వచ్చే ఏడాది నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయడానికి వీల్లేదని పేర్కొంది. పర్యావరణానికి హాని కలిగించే విగ్రహాల నిమజ్జనంతో హుస్సేన్‌సాగర్ కాలుష్యకారకంగా మారిపోయిందని, జల వనరులను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిమజ్జనంపై ఏటా ఎవరో ఒకరు సుప్రీంకోర్టుకు వస్తున్నారని, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ తీరు సరిగ్గా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. 

సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెల 19 నిమజ్జనం నిర్వహించాలని నిర్ణయించినందుకు ఆ మేరకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. సుప్రీం కోర్టు తీర్పపై భాగ్యనగర ఉత్సవ సమితి సైతం హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలపై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చిన నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి మట్టి విగ్రహాన్నే నెలకొల్పతామని కొద్దిరోజుల క్రితమే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ప్రకటించిన సంగతి తెలిసిందే.

Related posts

సోమేశ్ కుమార్ వీఆర్ఎస్ కు ఆమోదం.. త్వరలోనే బీఆర్ఎస్ లోకి?

Drukpadam

విమాన భోజనంలో పాము తల… హడలిపోయిన సిబ్బంది!

Drukpadam

దేశవ్యాప్తంగా 100 సైనిక స్కూళ్లు.. రక్షణమంత్రి రాజనాథ్ సింగ్ !

Drukpadam

Leave a Comment