Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏకంగా 70 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించిన కిషన్ రెడ్డి…

కంగా 70 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించిన కిషన్ రెడ్డి…
  • -అరుణాచల్ ప్రదేశ్ లో కిషన్ రెడ్డి పర్యటన
  • -పరశురామ్ కుంద్ నుంచి మరువా వరకు ప్రయాణం
  • -స్వయంగా బైక్ నడిపిన వైనం
  • -అరుణాచల్ ప్రదేశ్ ను అభివృద్ధి చేస్తానని హామీ

కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సుమారు 70 కిలోమీటర్లు బైక్ పై ప్రయాణించారు. కిషన్ రెడ్డి స్వయంగా ద్విచక్రవాహనాన్ని నడపడం విశేషం. పరశురామ్ కుంద్ నుంచి మరువా వరకు ఆయన బైక్ పై ప్రయాణించారు. ప్రకృతి అందాలతో అలరారే దట్టమైన అటవీప్రాంతం గుండా కిషన్ రెడ్డి ప్రయాణం సాగింది.

అందమైన లోయలు, ఆకట్టుకునే పర్వత శ్రేణులతో కూడిన అరుణాచల్ ప్రదేశ్ ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కిషన్ రెడ్డి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిగానూ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Related posts

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు…

Drukpadam

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కిసాన్ సంసద్ …భారీగా హాజరైన రైతుసంఘాల నేతలు…

Drukpadam

జర్నలిస్టు కుటుంబాలకు అండగా ఉంటాం..బుర్ర సంపత్ కుమార్

Drukpadam

Leave a Comment