Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అద్వానీకి 94 ఏళ్ళు …పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రముఖులు…

అద్వానీకి 94 ఏళ్ళు …పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన ప్రముఖులు…
-అద్వానీని కలిసి విషెస్ చెప్పిన ఉపరాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రి
-నేడు అద్వానీ పుట్టిన రోజు
-శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన నివాసానికి వచ్చిన ప్రముఖులు
-1927లో కరాచీలో జన్మించిన అద్వానీ

బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈరోజుతో ఆయన 94వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు పలువురు ప్రముఖులు ఆయన నివాసానికి వచ్చారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా వీరంతా ఒకే చోట కూర్చోని మనసు విప్పి మాట్లాడుకున్నారు.

మరోవైపు మోదీ ట్విట్టర్ ద్వారా కూడా అద్వానీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘గౌరవనీయులైన అద్వానీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన సంపూర్ణ ఆరోగ్యం, ఆయుష్షుతో ఉండాలని ప్రార్థిస్తున్నాను. దేశ ప్రజలను చైతన్యపరచడంలో, మన సంస్కృతిని విస్తరింపజేయడంలో ఆయన చేసిన కృషి చాలా గొప్పది. ఆయన మేధో సంపత్తి ఎంతో గర్వించదగినది’ అని మోదీ పేర్కొన్నారు.

1927లో ప్రస్తుత పాకిస్థాన్ లోని కరాచీలో అద్వానీ జన్మించారు. స్వాతంత్ర్యం సందర్భంగా దేశం విడిపోయినప్పుడు ఆయన కుటుంబం కరాచీ నుంచి భారత్ కు తరలి వచ్చింది. మన దేశంలో బీజేపీ అధికారంలోకి రావడానికి అద్వానీ చేసిన కృషి వెలకట్టలేనిది. అయితే ఆయన వయో భారం రీత్యా ఇంటివద్దనే విశ్రాంతి తీసుకుంటున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు అద్వానీ చేరిన కృషి అమోఘం . ఆయన రథ యాత్ర దేశరాజకీయాలనే మార్చివేసింది. ఆయన రామజన్మభూమి పేరుతొ రథయాత్ర మతకల్లోలాలకి కారణం అవుతుందని అప్పటి బీహార్ సీఎం గా ఉన్న లల్లూ ప్రసాద్ యాదవ్ అద్వానీ రథయాత్రను అడ్డుకొని అరెస్ట్ చేశారు.తరువాత దేశంలో ఇది సంచలనంగా మారింది.

Related posts

తెలంగాణా కాంగ్రెస్ లో ముసలం …

Drukpadam

పునీత్ అంత్యక్రియలు రేపటికి వాయిదా – అమెరికానుంచి పెద్ద కుమార్తె రావడం ఆలశ్యం

Drukpadam

జర్నలిస్ట్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలి:టి యూ డబ్ల్యూ జె ( ఐ జె యూ )

Drukpadam

Leave a Comment