Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఆ మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలంటూ.. ఏపీ వ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు!

  • తన భార్య గురించి దారుణంగా మాట్లాడారంటూ విలపించిన చంద్రబాబు
  • నేడు నందమూరి కుటుంబ సభ్యుల తీవ్ర స్పందన
  • కళ్లకు గంతలు కట్టుకుని టీడీపీ శ్రేణుల నిరసన

నిన్న అసెంబ్లీలో వైసీపీ నేతలు తన భార్య గురించి దారుణంగా మాట్లాడారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వాకౌట్ చేయడం, తదనంతరం ప్రెస్ మీట్ లో విలపించడం ప్రకంపనలు రేపుతోంది.
దీనిపై ఈరోజు నందమూరి కుటుంబ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా స్పందించారు కూడా. 

మరోపక్క, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలను చేపట్టాయి. అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

Related posts

జగన్ ను ఓడించాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలవాలి: పవన్ కల్యాణ్

Drukpadam

ప్రభుత్వ ఏర్పాటుకు మమ్మల్ని ఆహ్వానించండి: గవర్నర్ ను కోరిన కూటమి నేతలు…

Ram Narayana

ఎన్నికల్లో అల్లర్ల నేపథ్యంలో ఏపీలో ప్రతి జిల్లాకు ప్రత్యేక పోలీస్ అధికారి …

Ram Narayana

Leave a Comment