Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

షుగర్‌, బీపీ రోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త …

షుగర్‌, బీపీ రోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త …
-ఉచితంగా ఔషధాలు పంపిణీకి తెలంగాణ సర్కార్ నిర్ణయం
-వచ్చేనెల నుంచి ఎన్సీడీ కిట్ల పంపిణీ

షుగర్‌, బీపీ, హైబీపీ వంటి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నవారికి వచ్చేనెల నుంచి నాన్‌ కమ్యూనబుల్‌ డిసీజెస్‌ (ఎన్సీడీ) కిట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం ఎన్‌హెచ్‌ఎంలో భాగంగా నిర్వహించిన సమీక్షలో ఈ కిట్లను పరిశీలించారు. రాష్ట్రవ్యాప్తంగా అసంక్రమిత వ్యాధులను గుర్తించడంలోభాగంగా పరీక్షలు నిర్వహించగా.. ఏడు లక్షల మంది షుగర్‌ పేషెంట్లు, 20 లక్షల మంది బీపీ పేషెంట్లు ఉన్నట్టు తేలింది. వీరందరికీ దశలవారీగా ఎన్సీడీ కిట్లను పంపిణీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. షుగర్‌, బీపీ నియంత్రణ మందులు అందించే ఈ కిట్లను ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించింది. ‘ఉన్నతమైన జీవనానికై ఆరోగ్యకరమైన అలవాట్లు’ అనే నినాదాన్ని కిట్లపై ప్రచురించింది.

సమతుల ఆహారం, వ్యాయామం, పొగ తాగరాదు, జంక్‌ ఫుడ్‌ తినరాదు, మద్యం సేవించరాదు, యోగా, మంచి నిద్ర వంటి ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి పేర్కొన్నది. రెండో వైపు షుగర్‌, బీపీ లక్షణాలతోపాటు వాటి వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వివరించింది. కిట్‌లో ఉదయం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వేసుకొనే మందులు నెలకు సరిపోయే షుగర్‌, బీపీ మందులను ఉంచి కిట్లను రోగులకు అందించనున్నారు.

Related posts

త‌మిళ‌నాడులో కొత్త ప‌థ‌కం.. యాక్సిడెంట్ బాధితుల‌కు సాయం చేస్తే రివార్డు!

Drukpadam

వీకెండ్స్ లో కాళేశ్వరం టూర్.. రూ.2 వేలలోపే ట్రిప్…

Drukpadam

చీఫ్ సెక్రటరీపై విమర్శలు గుప్పించిన ఏపీ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ!

Drukpadam

Leave a Comment