Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలుగు రాష్ట్రాల్లో మంటలు రేపిన మధిర కౌన్సిలర్ మల్లాది వాసు మాటలు …

తెలుగు రాష్ట్రాల్లో మంటలు రేపిన మధిర కౌన్సిలర్ మల్లాది వాసు మాటలు …
-కొడాలి నాని ,వల్లభనేని వంశీ ,అంబటి రాంబాబు లను అంతమొందించేందుకు మిషన్

-మిషన్ఏర్పాటు చేసి అంతమొందిస్తే నా వాటాగా 50 లక్షలు ఇస్తా నని -ప్రకటన

-వాసు మాటలపై స్పందించిన వల్లభనేని …ఉడతా ఊపులకు -చింతకాయలూ రాలవు

-అన్నవాడు మాటమీద నిలబడాలి … నిరూపించుకోవాలి …

-వాసు మాటలు చంద్రబాబు డైరక్షన్ లోనే…కమ్మ కులానికి చంద్రబాబు చీడపురుగు
-ఆబ్బె..ఆబ్బె … నేను ఆలా అనలేదు …కావాలనే ఎడిట్ చేసి పెట్టారు…మల్లాది వాసు
-నాకు ఎవరిని చంపాలనే ఉద్దేశం లేదు ,నన్ను బదనాం చేసేందుకు ఎడిట్ చేసి పోస్ట్ పెట్టారు

తెలంగాణ రాష్ట్రంలోని మధిర కు చెందిన మల్లాది వాసు కమ్మజన సమారాధనలో చేసిన మాటలు తెలుగు రాష్ట్రాల్లో మంటలు రేపుతున్నాయి. మధిర లో జరిగిన కమ్మజన వనభోజనాల్లో ఆయన మాట్లాడుతూ ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై మళ్లారు . అక్కడ తమ కులస్తులైన మంత్రి కొడాలి నాని , ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ,మదపుటేనుగులా వాగుతున్న అంబటి రాంబాబులను పై కామెంట్ చేశారు. పరిటాల రవి ని అంతమొందించేందుకు వారు మొద్దుశ్రీను మిషన్ ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం కూడా మిషన్ ఏర్పాటుకు చేసి కోడలి నాని , వల్లభనేని వంశీ ,అంబటి రాంబాబులను అంతమొందించాలని అన్నారు. అందుకు ఎవరైనా ముందుకు వస్తే దానికి తనవంతుగా 50 లక్షలు ఇస్తానని ప్రకటించారు . దీనిపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్రంగా స్పందించారు. తమపై కమ్మజన వనభోజనాల్లో చంద్రబాబు డైరక్షన్ లోనే మాటలను అనిపిస్తున్నారని ఆగ్రహం ప్రకటించారు. ఏపీ సీఎం జగన్ మీద కూడా గాల్లో వచ్చినవాడు గాల్లోనే పోతాడని చంద్రబాబు అన్న విషయాన్నీ గుర్తు చేశారు. ఇక్కడే కాదు కుల బోజనాల్లో మా ప్రస్తావన తీసుకోని వచ్చి కొడాలినాని ,వంశీ లను కమ్మకులం జరిగే కార్యక్రమాలకు పిలవద్దని మాట్లాడుతున్నారని ఇది చంద్రబాబు సంస్కృతీ అని వంశీ అన్నారు. అరికపూడి గాంధీ కూడా హైద్రాబాద్ లో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు ను వెనకేసుకొని వచ్చారని అన్నారు. కమ్మ కులస్తులను అన్ని పార్టీల్లో చేర్చి తన కనుసన్నల్లో వారిని నడిపించటం చంద్రబాబుకే చెల్లిందని వంశీ ఆరోపించారు. అంతకుముందు రాజ్యసభ ఎంపీ లను కూడా అదే విధంగా బీజేపీలోకి పంపించారని అన్నారు. కుమ్మ కులానికి పెద్ద చీడపురుగు చంద్రబాబే నాని అన్నారు. మహానుబాహుడు స్వర్గీయ ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలకోసమే తెలుగుదేశం పార్టీ పెడితే చంద్రబాబు లాంటి చీడపురుగులు పార్టీలో చేరి కులపార్టీ అనే ముద్ర వేసుకుంటున్నారని పేదలకోసమే పెట్టిన పార్టీని ఆ స్థాయికి దిగజార్చారని అన్నారు.

ఆబ్బె ..ఆబ్బె నేను ఆలా అనలేదు…మల్లాది వాసు మధిర కౌన్సిలర్

టీఆర్ యస్ పార్టీ కి చెందిన మధిర కౌన్సిలర్ మల్లాది వాసు తాను ఎవరిని చంపాలని అనలేదని ,మధిరలో జరిగిన కమ్మ వనభోజనాలలో మాట్లాడిన మాట నిజమే కానీ కొడాలినాని ,వల్లభనేని వంశీ ,అంబటి రాంబాబులను చంపాలని అనలేదు …. ఆబ్బె …ఆబ్బె నేను అసలు ఆలా నలేదు . కావాలనే నన్ను బదనాం చేసేందుకు వీడియో ఎడిట్ చేసి పెట్టారు అని అన్నారు.అయితే మల్లాది తన మాటల్లోనే తత్తర పడటం , తాను అన్న మాటలు వీడియో లో రికార్డు అవ్వడం . అక్కడ కు వచ్చిన వారు కూడా మల్లాది వాసు మాటలకూ నవ్వుతు చప్పట్లు కొట్టడం, కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేసిన విషయాన్నీ గమనించనట్లు ఉన్నారు .

Related posts

వ‌ర‌ద‌ల‌తో రూ.1,400 కోట్ల న‌ష్టం.. త‌క్ష‌ణ‌మే వెయ్యి కోట్లు ఇవ్వండి:కేంద్రానికి తెలంగాణ నివేద‌న‌

Drukpadam

బ్యాంకు లాకర్‌లో దాచుకున్న డబ్బుకు చెదలు.. గొల్లుమన్న మహిళ!

Drukpadam

మైసూరు-చెన్నై వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఆరంభం.. 

Drukpadam

Leave a Comment