Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బంపరాఫర్!

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బంపరాఫర్!
ట్రిప్ పాసుల్లో రాయితీలు
20 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి 30 సార్లు ప్రయాణించొచ్చు
జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గంలో చార్జీ తగ్గింపు
ఈ నెల 18 నుంచి జనవరి 15 వరకు ఆఫర్

హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులకోసం బంపర్ ఆఫర్ ప్రకటించారు. 20 సార్లు చార్జితో ఎంపిక చేసిన రూట్లలో 30 సార్లు ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. మెట్రో లో ప్రయాణికుల సంఖ్యను పెంచే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో చాలాకాలం మెట్రో సర్వీస్ లను నిలిపివేసింది. తరువాత తిరిగి ప్రారంభమైనప్పటికీ ప్రయాణికులు పెద్దగా మెట్రో సేవలను ఉపయోగించుకోవడంలేదు. ఇప్పటికి కరోనా భయం ప్రజలను వీడలేదు. ప్రయాణికుల సంఖ్య ను పెంచుకోవాలనే ప్రయత్నాల్లో భాగంగానే మెట్రో యాజమాన్యం కొత్త ,కొత్త స్కీములు ప్రవేశ పెడుతుంది.

నిత్యం మెట్రో రైలులో ప్రయాణించే వారి కోసం హైదరాబాద్ ఎల్ అండ్ టీ మెట్రో పండుగ ఆఫర్లు ప్రకటించింది. ‘మెట్రో సువర్ణ ఆఫర్ 2021’ పేరుతో ఈ నెల 18 నుంచి జనవరి 15 మధ్య ట్రిప్ పాసుల్లో పలు రాయితీలు ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 20 ప్రయాణాలకు డబ్బులు చెల్లించి 30 సార్లు ప్రయాణించవచ్చు. అయితే, ఈ అవకాశాన్ని 45 రోజుల్లోపు వినియోగించుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న మెట్రో కార్డుపైనే ఈ ఆఫర్‌ను పొందొచ్చు. అలాగే, జేబీఎస్-ఎంజీబీఎస్ మార్గంలో ప్రస్తుతం 10 కిలోమీటర్ల దూరానికి రూ.35 వసూలు చేస్తుండగా, ఇకపై దీనిని రూ. 15కి తగ్గించారు. అయితే, ఇది పూర్తిస్థాయి తగ్గింపు కాదు. పైన పేర్కొన్న రోజుల్లో మాత్రమే వర్తిస్తుంది.

నెలలో 20 సార్లు కంటే ఎక్కువ సార్లు ప్రయాణించే వారి కోసం ప్రతి నెలా లక్కీడ్రా తీసి ఐదుగురు విజేతలను ఎంపిక చేస్తారు. లక్కీ డ్రా కోసం వీరు తమ కార్డును టీ-సవారి, లేదంటే మెట్రో స్టేషన్లలో నమోదు చేసుకోవాల్సి ఉంటుందని హైదరాబాద్ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు.

Related posts

అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అతి తీవ్ర తుపాను

Drukpadam

క్షీణించిన లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఆరోగ్యం.. ఎయిమ్స్ కు త‌ర‌లింపు

Drukpadam

ఆయుష్మాన్ భారత్ లో ప్రతి కుటుంబానికి హెల్త్ కార్డు…

Drukpadam

Leave a Comment