Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
సినిమా వార్తలు

హైదరాబాదులో రోడ్డు ప్రమాదం.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ దుర్మరణం!

హైదరాబాదులో రోడ్డు ప్రమాదం.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ దుర్మరణం!

  • ఉదయం ఇంటి నుంచి డ్యూటీకి వస్తుండగా ప్రమాదం
  • బైక్ ను వేగంగా ఢీకొన్న ట్రక్కు
  • అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన మధుసూదన్

రోడ్డు ప్రమాదంలో ఓ యువ జర్నలిస్ట్ దుర్మణంపాలు కావడం మీడియా రంగంలో విషాదాన్ని నింపింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్నెట్ డెస్క్ లో సబ్ ఎడిటర్ గా పని చేస్తున్న ఓతూరి మధుసూదన్ ఈ ఉదయం దుర్మరణం చెందారు. ఉదయం ఇంటి నుంచి డ్యూటీకి వస్తుండగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఆయన బైక్ ను ఓ ట్రక్ ఢీకొంది. అత్యంత వేగంగా వచ్చిన ఆ ట్రక్ బైక్ ను డీకొట్టిన తర్వాత ఆగకుండా వెళ్లిపోయింది. ఈ దుర్ఘటనలో మధుసూదన్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.

ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ట్రక్కును పోలీసులు గుర్తించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు మధు మృతి పట్ల జర్నలిస్టులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

Related posts

హీరో ఎవరైనా అంతిమంగా సినిమా గెలవాలి … పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్!

Drukpadam

‘మీ సినిమాలు బీజేపీకి అనుకూలం’ అన్న ప్రచారానికి అక్షయ్ కుమార్ గట్టి కౌంటర్

Ram Narayana

మీరంటే టెన్షన్ సార్… బాలకృష్ణ ‘అన్ స్టాపబుల్ లో బాలయ్యతో రాజమౌళి!

Drukpadam

Leave a Comment