![](https://i0.wp.com/drukpadam.com/wp-content/uploads/2021/03/e7935d95-48ee-49c8-918a-a92708f9600d-32675-0000088354c22959_file.jpg?w=1400&ssl=1)
మెగాస్టార్ చిరంజీవికి , తనయుడు రామ్ చరణ్ కి స్వాగతం పలికిన మంత్రి పువ్వాడ.
ఖమ్మంలోని మమత ఆసుపత్రిలో గల మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి ఇంటికి విచ్చేసిన ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి
, తనయుడు రామ్ చరణ్ లకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తనయుడు పువ్వాడ నయన్ ఘన స్వాగతం పలికారు.
ఇల్లందులో ఆచార్య చిత్ర షూటింగ్ నిమిత్తం ఖమ్మంకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారు, తనయుడు రామ్ చరణ్ కు మంత్రి పువ్వాడ తన ఇంట్లో బస ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా స్వయంగా వారికి స్వాగతం పలికి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువతో సత్కరించారు. షూటింగ్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్నందుకు చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు.