Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణ లోని వివిధ జిల్లాల్లో వాన, ఈదురుగాలుల బీభత్సం!

తెలంగాణ లోని వివిధ జిల్లాల్లో వాన, ఈదురుగాలుల బీభత్సం!
-తెలంగాణలో అకాల వర్షాలు
-కరీంనగర్ లో కుప్పకూలిన 70 అడుగుల హోర్డింగ్
-రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ వర్షాలు
-నేలకొరిగిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు

తెలంగాణలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్,జగిత్యాల ,నిజామాబాద్, పెద్దపల్లి వరంగల్ జిల్లాల్లో రాళ్ళవాన కురిసింది. కరీంనగర్ లో భారీ వర్షానికి ఈదురుగాలులు తోడవగా, భారీ హోర్డింగ్ లు సైతం కుప్పకూలాయి. ఫిబ్రవరిలో నిర్వహించతలపెట్టిన వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ప్రచారంలో భాగంగా గీతా భవన్ సెంటర్ లో రాముడి పట్టాభిషేకం భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. విద్యుద్దీప కాంతులతో వెలిగిపోయే ఈ 70 అడుగుల హోర్డింగ్ ఈదురుగాలుల తాకిడికి నేలకొరిగింది. అయితే, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

కరీంనగర్ జిల్లాల్లోని ఇతర ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. శంకరపట్నం, రామడుగు, చొప్పదండి, జమ్మికుంట, మానకొండూరు, పెద్దపల్లి ప్రాంతాల్లో అకాలవర్షంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ వర్షం, ఈదురుగాలులతో వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.

మిగతా ప్రాంతాలలో కూడా ఈదురు గళాలు ,వడగళ్ల వానకు అనేక పూరిగుడిశలు రేకుల షేడ్లు లేచిపోయాయి.దీనితో ప్రజలు భయబ్రాంతులకు గురైయ్యారు. పట్టి ,మిరప ఇతర పంటలు దెబ్బతిన్నాయి.

Related posts

నిజమాబాద్ సి.పి. కె.ఆర్. నాగరాజుకి , ఎం.పి అరవింద్ క్షమాపణ చెప్పాలి.

Drukpadam

ఇక్రిశాట్ పరిశోధనలు ప్రపంచానికి కొత్త దారి చూపించాలి: ప్రధాని మోదీ!

Drukpadam

మనిషి మనసులో వ్యాపించే వైరస్ కు వ్యాక్సిన్ కావాలి: చిన్నజీయర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Drukpadam

Leave a Comment