Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

ఎన్నికల అఫిడవిట్ లో అవాస్తవాలు.. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై కేసు నమోదు చేసిన సీఐడీ!

ఎన్నికల అఫిడవిట్ లో అవాస్తవాలు.. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుపై కేసు నమోదు చేసిన సీఐడీ!
-అశోక్ బాబుపై కేసును సీఐడీకి అప్పగించాలన్న లోకాయుక్త
గతేడాది ఆదేశాలు
-పలు సెక్షన్ల కింద సీఐడీ కేసు

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు చిక్కుల్లో పడ్డారు. ఆయనపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. అశోక్ బాబుపై కేసును సీఐడీకి అప్పగించాలని గతేడాది లోకాయుక్త ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అశోక్ బాబుపై సెక్షన్ 477, 420, 465 కింద కేసు నమోదు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నిక సమయంలో అఫిడవిట్ లో అవాస్తవాలు పేర్కొన్నారని సీఐడీ అధికారులు ఆరోపిస్తున్నారు. ఆయన బీకాం చదవకుండానే నకిలీ సర్టిఫికెట్లు ఇచ్చారని, సర్వీసు రికార్డు లేకుండానే తప్పుడు సమాచారం అందించారని సీఐడీ అధికారులు అభియోగం మోపారు. డిగ్రీ చదివినట్టు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నట్టు తెలిపారు. రికార్డులను తారుమారు చేశారన్న అభియోగాలతో కేసు నమోదు చేశారు. అశోక్ బాబు గతంలో ఏసీటీవో ఉద్యోగం చేశారు. ఇప్పుడు ఏపీ లో అశోక్ బాబు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. తప్పుడు సర్టిఫికెట్స్ తో ఉద్యోగం చేయడమే కాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘానికి ఇచ్చిన ధ్రువీకరణ పత్రంలో కూడా డిగ్రీ చదవకుండానే చదివినట్లు తెలపడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి.

Related posts

రైళ్లపై రాళ్లదాడులు.. ఐదేళ్ల శిక్ష తప్పదని రైల్వే హెచ్చరిక!

Drukpadam

ఫ్లోరిడాలో యాక్సిడెంట్.. భారతీయ టెకీ దుర్మరణం…!

Drukpadam

కవితను ఈడీ అరెస్ట్ చేసే అవకాశం …?

Drukpadam

Leave a Comment