Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలురాజకీయ వార్తలు

యూపీలో అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు… క్షేమంగా బయటపడ్డ నేత!

యూపీలో అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు… క్షేమంగా బయటపడ్డ నేత!

  • ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు
  • మీరట్ జిల్లాలో ప్రచారానికి వెళ్లిన ఒవైసీ
  • కితౌర్ ప్రాంతంలో పర్యటన
  • ఓ టోల్ గేట్ వద్ద ఒవైసీ కారుపై 4 రౌండ్ల కాల్పులు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రచారానికి వెళ్లిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు జరిగాయి. ఒవైసీ ఇవాళ మీరట్ జిల్లా కితౌర్ లో ప్రచారం నిర్వహించారు. అయితే తన వాహనంపై 4 రౌండ్లు కాల్పులు జరిగినట్టు ఒవైసీ వెల్లడించారు. దుండగులు ముగ్గురు, నలుగురు ఉండొచ్చని తెలిపారు. చిజార్సీ టోల్ గేట్ వద్ద ఈ ఘటన జరిగిందని ఆయన ట్విట్టర్ లో వెల్లడించారు. కారుకు బుల్లెట్లు తగిలిన ఫొటోను కూడా పంచుకున్నారు.

కాల్పులు జరిపిన అనంతరం వారు ఆయుధాలు పడేసి పారిపోయారని, ఈ ఘటనలో తన కారు టైరుకు పంక్చర్ అయిందని ఒవైసీ వివరించారు. దాంతో తాను మరో వాహనంలోకి మారి అక్కడ్నించి క్షేమంగా బయటపడ్డానని, అల్లా దయతో ఎలాంటి ముప్పు సంభవించలేదని వ్యాఖ్యానించారు.

Related posts

ధాన్యం కొనుగోళ్ల వివాదం … రేపు టీఆర్ఎస్ శాసనసభాపక్ష కీలక భేటీ!

Drukpadam

హుజురాబాద్ లో సామ, దాన, భేద, దండోపాయాలు!

Drukpadam

హుజూరాబాద్ ఎన్నికల్లో రూ.500 కోట్లు వెదజల్లినా టీఆర్ఎస్ ఓడిపోయింది: చత్తీస్ గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్!

Drukpadam

Leave a Comment