Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలురాజకీయ వార్తలు

యూపీలో అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు… క్షేమంగా బయటపడ్డ నేత!

యూపీలో అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు… క్షేమంగా బయటపడ్డ నేత!

  • ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు
  • మీరట్ జిల్లాలో ప్రచారానికి వెళ్లిన ఒవైసీ
  • కితౌర్ ప్రాంతంలో పర్యటన
  • ఓ టోల్ గేట్ వద్ద ఒవైసీ కారుపై 4 రౌండ్ల కాల్పులు

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రచారానికి వెళ్లిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వాహనంపై కాల్పులు జరిగాయి. ఒవైసీ ఇవాళ మీరట్ జిల్లా కితౌర్ లో ప్రచారం నిర్వహించారు. అయితే తన వాహనంపై 4 రౌండ్లు కాల్పులు జరిగినట్టు ఒవైసీ వెల్లడించారు. దుండగులు ముగ్గురు, నలుగురు ఉండొచ్చని తెలిపారు. చిజార్సీ టోల్ గేట్ వద్ద ఈ ఘటన జరిగిందని ఆయన ట్విట్టర్ లో వెల్లడించారు. కారుకు బుల్లెట్లు తగిలిన ఫొటోను కూడా పంచుకున్నారు.

కాల్పులు జరిపిన అనంతరం వారు ఆయుధాలు పడేసి పారిపోయారని, ఈ ఘటనలో తన కారు టైరుకు పంక్చర్ అయిందని ఒవైసీ వివరించారు. దాంతో తాను మరో వాహనంలోకి మారి అక్కడ్నించి క్షేమంగా బయటపడ్డానని, అల్లా దయతో ఎలాంటి ముప్పు సంభవించలేదని వ్యాఖ్యానించారు.

Related posts

మియాపూర్ లో 27 కిలోల బంగారం పట్టివేత

Ram Narayana

కేటీఆర్ మాటల దుమారం …. ఏపీ మంత్రుల కౌంటర్ ….

Drukpadam

ప్రభుత్వ ఎస్సీ వ్యతిరేక చర్యలకు డాక్టర్ సుధాకర్ బలయ్యారు: చంద్రబాబు…

Drukpadam

Leave a Comment