Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పాకిస్థాన్ లో.. బార్బర్ షాపుకు వెళ్లిన జర్నలిస్టు కాల్చివేత

  • సింధ్ ప్రావిన్స్ లోని సుక్కూర్ లో ఘటన
  • వాహనాల్లో వచ్చిన దుండగులు
  • జర్నలిస్టుపై విచక్షణ రహితంగా కాల్పులు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన జర్నలిస్టు
Hindu journalist killed in Pakistan

పాకిస్థాన్ లో  జర్నలిస్టు దారుణ హత్యకు గురయ్యాడు. ఆ పాత్రికేయుడి పేరు అజయ్ లాల్వానీ. వయసు 31 సంవత్సరాలు. ‘పుచానో’ అనే ఉర్దూ దినపత్రికలో అజయ్ లాల్వానీ రిపోర్టర్ గా పనిచేస్తున్నాడు. సింధ్ ప్రావిన్స్ లోని సుక్కూర్ పట్టణంలో ఆయనను దుండుగులు కాల్చి చంపారు. క్షవరం చేయించుకునేందుకు ఓ బార్బర్ షాపుకు వెళ్లిన అజయ్ పై రెండు బైకులు, ఓ కారులో వచ్చిన దుండుగులు తూటాల వర్షం కురిపించారు. విచక్షణ రహితంగా కాల్పులు జరపడంతో తీవ్రగాయాలపాలైన ఆ యువ పాత్రికేయుడు చికిత్స పొందుతూ మరణించాడు.

అజయ్ లాల్వానీ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు చెబుతుండగా, తల్లిదండ్రులు మాత్రం తమ కుమారుడికి ఎవరితోనూ శత్రుత్వంలేదని అంటున్నారు. అజయ్ హత్యను హిందూ ప్రజాప్రతినిధి లాల్ చంద్ హల్హీ ఖండించారు. ఈ ఘటన తీవ్ర ఆందోళనకరమని పేర్కొన్నారు. అటు, పాత్రికేయ సంఘాలు కూడా అజయ్ హత్యపై తీవ్రంగా స్పందించాయి. పాత్రికేయులు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు.

Related posts

అభివృద్ధిలో జర్నలిస్టుల సహకారం మరువలేనిది…మంత్రి సింగిరెడ్డి

Drukpadam

రూ.8 లక్షల ఆదాయం ఉన్న వారిని పన్ను నుంచి మినహాయించాలి: మద్రాస్ హైకోర్టులో పిటిషన్!

Drukpadam

నితీశ్ కుమార్, జగన్ ల కోసం పనిచేయడానికి బదులుగా కాంగ్రెస్ పునరుజ్జీవానికి పాటుపడి ఉండాల్సింది: ప్రశాంత్ కిశోర్

Drukpadam

Leave a Comment