Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తేనెటీగల దాడి…  మంత్రి పువ్వాడ క్షేమం..

తేనెటీగల దాడి…  మంత్రి పువ్వాడ క్షేమం..
– ఆందోళన చెందొద్దు అని ప్రకటన.
– రెండు రోజుపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు..

యాదాద్రి ఆలయం పునః ప్రారంభం సందర్భంగా సోమవారం జరిగిన మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై తేనెటీగల దాడి చేసిన విషయం విదితమే.

ఆలయ పశ్చిమ గోపురం(సప్తతల గోపురం)పై పూజా క్రతువులో ఉన్న మంత్రి దంపతులు పువ్వాడ అజయ్ కుమార్ వసంత లక్ష్మి గార్లు, వేద పండితులపై ఒక్కసారిగా తేనెటీగల దాడి చేశాయి.

తేనెటీగలు దాడి చేసినప్పటికీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు భక్తిభావంతో మహాకుంభ సంప్రోక్షణ పూజా పూర్తి చేశారు.

అనంతరం ప్రాథమిక చికిత్స కై హైదరాబాద్ కు బయల్దేరివెళ్లారు.

విషయం తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తీవ్ర అందోళనకు గురయ్యారు. ఫోన్ ద్వారా మాట్లాడి క్షేమ సమాచారం తెలుసుకోవాలని తీవ్ర ప్రయత్నం చేశారు. తమ నాయకుడికి ఏమి కావొద్దని, పూర్తి ఆరోగ్యంగా మళ్ళీ తిరిగి మా మధ్యకి రావాలని పలు ఆలయాల్లో పూజలు చేపట్టారు.

ఈ సందర్భంగా దాడి పై ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదని తాను క్షేమంగా ఉన్నానని మంత్రిపువ్వాడ ట్విట్టర్ ద్వారా పేర్కోన్నారు. వైద్యుల సూచనల మేరకు రెండు రోజులు పూర్తి విశ్రాంతి అవసరమని చెప్పారని వివరించారు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు, నాయకులు, అభిమానులు నెమ్మదించారు. త్వరగా తమ మధ్యకు రావాలని ఆకాంక్షిస్తున్నారు.

యాదాద్రి ఆలయం పునః ప్రారంభం సందర్భంగా సోమవారం జరిగిన మహాకుంభ సంప్రోక్షణలో పాల్గొన్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై తేనెటీగల దాడి చేశాయి. ఆలయ పంచతల గోపురంపై పూజా క్రతువులో ఉన్న మంత్రి, వేద పండితులు, మంత్రి వ్యక్తిగత భద్రత సిబ్బందిపైన తేనెటీగల దాడి జరిగింది. అయినప్పటికీ పూజలు కొనసాగించారు అనంతరం చికిత్స నిమిత్తం హైద్రాబాద్ వెళ్లారు .

ఉదయం 11:45 గంటల సమయంలో పూజా కార్యక్రమంలో నిమగ్నమైన మంత్రి పైకి ఒక్కసారిగా తేనెటీగలు దూసుకొచ్చాయి. తేనెటీగలు దాడి చేసినప్పటికీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భక్తిభావంతో మహాకుంభ సంప్రోక్షణ పూజా కార్యక్రమాన్ని కొనసాగించారు. ప్రాథమిక చికిత్స కొరకు పూజా క్రతువును ముగించుకొని హుటాహుటిన మంత్రి అజయ్ హైదరాబాద్ కు బయల్దేరివెళ్లారు.

Related posts

ప్రవేటీకరణ దిశగా ఎయిరిండియా…

Drukpadam

హైదరాబాద్ యువతలో పెరిగిన హార్ట్ ఎటాక్ రిస్క్

Drukpadam

ఇక ఆటో ఎక్కితే 5 శాతం జీఎస్టీ బాదుడు.. కొత్త ఏడాది నుంచి అమలు!

Drukpadam

Leave a Comment