Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

దుగ్గిరాల మండల కో-ఆప్షన్ సభ్యుని ఎన్నికలో వైసీపీకి షాక్ …టీడీపీ సభ్యుని ఎన్నిక !

దుగ్గిరాల మండల పరిషత్ కో ఆప్ష‌న్ స‌భ్యుడిగా టీడీపీ నేత ఎన్నిక‌

  • దుగ్గిరాల మండ‌ల ప‌రిష‌త్ కో ఆప్ష‌న్ స‌భ్యుడిగా టీడీపీ నేత‌
  • వ‌హిదుల్లాకు అనుకూలంగా 10 ఓట్లు
  • ఓటింగ్‌కు దూరంగా ఐదుగురు వైసీపీ ఎంపీటీసీలు

గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని దుగ్గిరాల మండ‌ల ప‌రిష‌త్ అధ్య‌క్షుడి ఎన్నిక‌లో భాగంగా కాసేప‌టి క్రితం ముగిసిన కో ఆప్ష‌న్ స‌భ్యుడి ఎన్నిక‌లో అధికార పార్టీ వైసీపీకి షాక్ త‌గిలింది. దుగ్గిరాల మండ‌ల ప‌రిష‌త్ కో ఆప్ష‌న్ స‌భ్యుడిగా టీడీపీ ప్ర‌తిపాదించిన వ‌హిదుల్లా ఎన్నిక‌య్యారు. కాసేప‌టి క్రితం ఓటింగ్ జ‌ర‌గ‌గా.. వ‌హిదుల్లాకు 10 ఓట్లు వ‌చ్చాయి. దీంతో ఆయ‌న కో ఆప్ష‌న్ స‌భ్యుడిగా ఎన్నికైన‌ట్లు అధికారులు ప్ర‌క‌టించారు.

కో ఆప్ష‌న్ స‌భ్యుడిగా టీడీపీ ప్ర‌తిపాదించిన వ‌హిదుల్లా ఎన్నిక‌పై ఓటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీటీసీలు స‌మావేశం నుంచి బయ‌ట‌కు వెళ్లిపోయారు. ఈ ఐదుగురు ఓటింగ్‌లో పాలుపంచుకోలేదు. ఓటింగ్‌కు దూరంగా ఉండేందుకే వీరు స‌మావేశం నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. దుగ్గిరాల ఎంపీపీని ఎలాగైనా ద‌క్కించుకోవాల్సిందేనన్న ల‌క్ష్యంతో సాగుతున్న వైసీపీకి ఈ ప‌రిణామం ఓ షాకేన‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

Related posts

తెలంగాణ లో బీజేపీ నాయకత్వ మార్పుపై ప్రచారం…లేదని కొట్టి పారేసిన కిషన్ రెడ్డి , తరుణ్ ఛుగ్…

Drukpadam

ఎమ్మెల్సీ ల ఎన్నికల్లో రెడ్లకు పెద్ద పీట వేసిన టీఆర్ యస్ …బలహీనవర్గాల పెదవి విరుపు!

Drukpadam

గుర్రానికి బీజేపీ జెండా రంగులు… ఫిర్యాదు చేసిన మేనకా గాంధీ సంస్థ!

Drukpadam

Leave a Comment