Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

యమునోత్రి హైవేపై చిక్కుకుపోయిన 10 వేల మంది యాత్రికులు!

యమునోత్రి హైవేపై చిక్కుకుపోయిన 10 వేల మంది యాత్రికులు!
-రహదారిపై కూలిపోయిన రక్షణ గోడ
-ప్రారంభమైన పునరుద్ధరణ పనులు
-మూడు రోజులు పట్టొచ్చన్న అంచనా

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యమునోత్రి ఆలయానికి దారితీసే ప్రధాన రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. రక్షణ గోడ కూలిపోవడంతో ఆ మార్గంలో వాహనాలు ప్రయాణించడానికి వీల్లేకుండా పోయింది. సుమారు 10వేల మంది యాత్రికులు చిక్కుకుపోయారు. గోడ కూలిపోవడం కారణంగా ఎక్కడి వాహనాలు అక్కడే ఆ మార్గంలో నిలిచిపోయాయి.

ఇప్పటికిప్పుడు సదరు రహదారి మార్గం అందుబాటులోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కనీసం మూడు రోజులు అయినా పట్టొచ్చని అధికార వర్గాలు చెబుతున్న అనధికార సమాచారం. చిన్న వాహనాల్లో చిక్కుకుపోయిన వారిని అక్కడి నుంచి తరలించే చర్యలను అధికారులు మొదలు పెట్టారు. అయితే, దూర ప్రాంతాల నుంచి పెద్ద వాహనాల్లో వచ్చిన వారు.. వాటిని విడిచి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పునరుద్ధరణ పనులు మొదలయ్యాయి.

Related posts

మీకు పదోన్నతులు కల్పిస్తున్న సీఎంను ఆ విధంగా మాట్లాడతారా?: ఉపాధ్యాయులపై సజ్జల అసంతృప్తి!

Drukpadam

మార్పుతెచ్చే ఆయుధం జర్నలిస్టు కలమే….మంత్రి పువ్వాడ

Drukpadam

గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ తరలింపు …వ్యాపారుల ,హమాలీల నిరసనలు!

Drukpadam

Leave a Comment