Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీ మంత్రి విశ్వరూప్ కు ముంబై లీలావతి ఆసుపత్రిలో కొనసాగుతున్న చికిత్స ..

ముంబై లీలావ‌తి ఆసుపత్రిలో ఏపీ మంత్రి విశ్వరూప్‌కు కొన‌సాగుతున్న ఆప‌రేష‌న్‌

  • వ‌రుస‌గా రెండు సార్లు అస్వ‌స్థ‌త‌కు గురైన విశ్వ‌రూప్‌
  • ఇటీవలే ముంబైలోని లీలావ‌తి ఆసుపత్రిలో చేరిక‌
  • విశ్వ‌రూప్ గుండెకు ఆప‌రేష‌న్ అవ‌స‌ర‌మ‌న్న వైద్యులు
  • ఉద‌యం 10 గంట‌ల‌కు మొద‌లై కొన‌సాగుతున్న ఆప‌రేష‌న్‌

గుండె జ‌బ్బు బారిన ప‌డ్డ ఏపీ ర‌వాణా శాఖ మంత్రి పినిపే విశ్వ‌రూప్‌కు సోమ‌వారం ముంబైలోని లీలావ‌తి ఆసుప‌త్రిలో ఆప‌రేష‌న్ మొద‌లైంది. ఈ ఉద‌యం 10 గంటలకు విశ్వ‌రూప్ గుండెకు మొద‌లైన ఆప‌రేష‌న్ గంట‌ల త‌ర‌బ‌డి కొన‌సాగుతోంది. సాయంత్రం 5 గంట‌లు దాటినా విశ్వ‌రూప్‌కు ఆప‌రేష‌న్ ఇంకా పూర్తి కాలేదు.

ఈ నెల 2న వైఎస్సార్ వ‌ర్థంతి కార్య‌క్ర‌మాల్లో పాలుపంచుకున్న సంద‌ర్భంగా అనారోగ్యానికి గురైన విశ్వ‌రూప్ రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో ప్రాథమిక చికిత్స అనంత‌రం హైద‌రాబాద్‌లో వైద్యం చేయించుకున్నారు. ఈ సంద‌ర్భంగా విశ్వ‌రూప్‌కు పెద్ద ప్ర‌మాద‌మేమీ లేద‌ని వైద్యులు చెప్పిన రోజుల వ్య‌వ‌ధిలోనే ఆయ‌న మ‌రోమారు అనారోగ్యానికి గురి కాగా… మెరుగైన వైద్య చికిత్స‌ కోసం ఆయ‌న‌ను ముంబైకి త‌ర‌లించిన సంగతి తెలిసిందే.

ఈ క్ర‌మంలో విశ్వ‌రూప్ ఆరోగ్య ప‌రిస్థితిని ప‌రిశీలించిన లీలావ‌తి ఆసుపత్రి వైద్యులు ఆయ‌న గుండెకు ఆప‌రేష‌న్ అవ‌స‌ర‌మ‌ని సూచించారు. కుటుంబ స‌భ్యుల అంగీకారంతో సోమ‌వారం ఉద‌యం విశ్వ‌రూప్‌కు ఆప‌రేష‌న్ మొద‌లైంది.

Related posts

ఖమ్మం జర్నలిస్టులకు ఐదు ఎకరాల స్థలం ఎలా సరిపోతుంది …సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా…

Drukpadam

రాహుల్ గాంధీ కేసును విచారించలేనన్న గుజరాత్ హైకోర్టు జడ్జి.

Drukpadam

మనుషులంటే విసిగిపోయి రెండు దశాబ్దాలుగా గుహలోనే జీవితం!

Drukpadam

Leave a Comment