Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మంగళగిరి పార్టీ కార్యాలయంలో చంద్రబాబు లోకేశ్ తో ప్రత్యేక భేటీ!

టీడీపీ ఇన్చార్జిలతో చంద్రబాబు సమావేశం… లోకేశ్ తో ప్రత్యేక భేటీ!

  • పార్టీ ప్రధాన కార్యాలయంలో చంద్రబాబు సమీక్ష
  • మంగళగిరి, కుప్పం, కర్నూలు, ఇచ్ఛాపురం ఇన్చార్జిలతో భేటీ
  • దిశానిర్దేశం చేసిన టీడీపీ అధినేత

టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలను సీరియస్ గా తీసుకుంటున్నారు. వైసీపీని ఓడించితీరాలన్న కసితో ఉన్న చంద్రబాబు గత కొన్ని రోజులుగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నేడు మంగళగిరి, కుప్పం, కర్నూలు, ఇచ్ఛాపురం నియోజకవర్గాల ఇన్చార్జిలతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గంపై నారా లోకేశ్ తో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మంగళగిరి నియోజకవర్గ గ్రౌండ్ రిపోర్టును లోకేశ్ ను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పరిస్థితులు, ఎన్నికల సన్నద్ధత, వ్యూహాలపై చర్చించారు.

అటు, ఇతర నియోజకవర్గాల ఇన్చార్జిలకు కూడా గెలుపే పరమావధి అని ఉద్బోధించారు. ఇన్చార్జిలు ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశమై వారి మనోభావాలను తెలుసుకున్నారు.

మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రానున్నందున, పార్టీ కోసం కష్టపడాలని సూచించారు. నియోజకవర్గంలో అందరినీ కలుపుకునిపోవడంపై శ్రద్ధ చూపాలని స్పష్టం చేశారు. కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు.

ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలకు క్లాస్ తీసుకున్న చంద్రబాబు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేతలు ఎందుకు కలిసి పని చేయలేకపోతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అధిష్ఠానం ఆదేశిస్తే… కేవలం ఇన్ఛార్జీలు మాత్రమే భేటీ కావడంపై కన్నెర్ర చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో కూడా కొన్ని నియోజకవర్గాల్లో నేతలు వెనుకబడి ఉన్నారని అన్నారు. సభ్యత్వాల నమోదులో ఉమ్మడి జిల్లాలో గురజాల నియోజకవర్గం ముందంజలో ఉందని చెప్పారు. ఇతర నియోజకవర్గాలు ఎందుకు వెనుకబడి ఉన్నాయని ప్రశ్నించారు. జల్లా విడిపోయిన తర్వాత నేతల మధ్య సమన్వయం కొరవడిందని అన్నారు. 

కొందరు పోలీసుల వ్యవహారశైలిపై ప్రైవేటు కేసులు పెట్టాలని చెప్పినా ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యరపతినేని కల్పించుకుంటూ… గురజాలలో నాలుగు ప్రైవేట్ కేసులు పెట్టామని చెప్పారు. ఇకపై ప్రతి నేత పనితీరును వ్యక్తిగతంగా సమీక్షిస్తానని అన్నారు. పార్టీ కార్యక్రమాలకు పిలుపునిస్తుంటే… కొందరు నేతలు ముందుగానే పోలీసులకు చెప్పి హౌస్ అరెస్ట్ చేయించుకుంటున్నారని… ఇలాంటి వాటిని ఇకపై సహించబోనని హెచ్చరించారు. మరోవైపు అందరం కలిసి పని చేస్తామని చంద్రబాబుకు నేతలు చెప్పినట్టు తెలుస్తోంది.

Related posts

రాజస్థాన్ సీఎంపై సోనియా రెండ్రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు: కేసీ వేణుగోపాల్

Drukpadam

బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్: శరద్ పవార్ విమర్శలు

Drukpadam

తెలంగాణలో అవినీతి ,కుటుంబపాలన పై ప్రధాని మోడీ నిప్పులు…

Drukpadam

Leave a Comment