Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం గులాబీ మాయం …బీఆర్ యస్ సభకు సర్వం సిద్ధం …

ఖమ్మం గులాబీ మాయంబీఆర్ యస్ సభకు సర్వం సిద్ధం
ప్లైక్సీలు , హోర్డింగ్ లతో నిండిపోయిన ఖమ్మం
ఖమ్మం నుంచి వైరా వెళ్లే రోడ్ వెలుగు జిలుగులు
కలెక్టరేట్ ప్రారంభానికి కేసీఆర్ తోపాటు రానున్న అతిరధ మహారధులు
కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం
పక్కనే భారీ బహిరంగ సభలక్షలాదిగా జనసమీకరణ
సభలో ప్రసంగించనున్న కేసీఆర్ , పినారై విజయన్ , కేజ్రీవాల్ , డి
రాజా .అఖిలేష్ , తమ్మినేని ,కూనంనేని

 

ఖమ్మం చరిత్రలో కానీ విని ఎరగని రీతిలో జరుగునున్న బీఆర్ యస్ మొదటి సభకు లక్షలాది మంది ప్రజలు తరలి వచ్చే విధంగా నిర్వాహకులు ప్లాన్ చేశారు . దీంతో ఖమ్మం గులాబీ మాయం అంయింది .

వెలుగు జిలుగులతో ఖమ్మం నూతన కలెక్టరేట్ సముదాయం

నూతన కలెక్టరేట్ సముదాయంతోపాటు , కంటి వెలుగు కార్యక్రమాన్ని కూడా సీఎం లు జాతీయ నేతల చేతులమీదుగా ప్రారంభించే ఏర్పాట్లు చేశారు . మొత్తం సభ ఏర్పాట్లను గత వారం రోజులకు పైగా మకాం వేసిన రాష్ట్ర మంత్రి హరీష్ రావు పర్వవేక్షించారు . దగ్గరుండి అన్ని పనులను ప్రణాళిక బద్దగా ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూశారు . బహిరంగ సభాస్థలం దగ్గర డయాస్ , పార్కింగ్ స్థలాలు వలంటీర్ల ఏర్పాటు , వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీస్ అధికారులతో చర్చించారు .

 

ఖమ్మం లో ఎక్కడ చూసిన బీఆర్ యస్ జెండాలు ప్లేక్సీలు , హోర్డింగ్ లతో హోరెత్తుతోంది. ఒకరకంగా చెప్పాలంటే ఖమ్మం నగరం గులాబీ రంగులతో గుబాళిస్తుంది. జిల్లా నుంచే కాకుండా పక్కన ఉన్న జిల్లాల నుంచి ప్రజలు అద్భుత సభను చూసేందుకు తరలి వస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. . సభ స్థలి వైపు వెళ్లే వైరా రోడ్ మొత్తం మూసివేశారు . సభకు వచ్చే వాహనాలు మినహా ఇక్కడికి మరో వాహనాలు వచ్చే అవకాశం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు .

బహిరంగ సభ ప్రాంగణం

నూతన కలెక్టరేట్ సముదాయం పక్కనే రెండు హెలిపాడ్ లను ఏర్పాటు చేశారు . హైద్రాబాద్ , విజయవాడ లనుంచి రెండు హెలికాఫ్టర్లు వచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు సభ ఉంటుంది. సభలో కేసీఆర్ తోపాటు పినరై విజయన్, అరవింద్, కేజ్రీవాల్ భగవత్ సింగ్ మాన్ , సీపీఐ జాతీయ కార్యదర్శి జి.రాజా, సిపిఎం ,సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం,కూనంనేని సాంబశివరావులు సభలో ప్రసంగించనున్నారు. సభ ముగియగానే నాయకులు వెళ్లి పోతారు . సిపిఎం , సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వారే అయినందున వారు రేపు నేరుగా సభాస్థలికి రానున్నట్లు సమాచారం .

 

సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనుంది . వచ్చే గెస్టులతో దీన్ని ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేశారు . లక్షలాదిగా తరలి ప్రజలు వస్తారని అంచనాలు ఉండటంతో ఖమ్మం సభపై రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొన్నది .ఈసభ ద్వారా కేసీఆర్ దేశ ప్రజలకు ఏమి సందేశం ఇవ్వనున్నారనే ఉత్సుకత కనబడుతుంది.

 

Related posts

మూడురోజులపాటు దేశ రాజకీయ కేంద్రంగా హైద్రాబాద్ మహానగరం…

Drukpadam

నాలుగు కార్లు, ఒక హెలికాప్టర్ నిండా డబ్బుతో పారిపోయిన అష్రాఫ్ ఘనీ!

Drukpadam

రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి శరద్ పవర్ నో ….

Drukpadam

Leave a Comment