Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మం గుప్త హోటల్ నిర్వాకుల కొత్త ఆలోచన!

ఖమ్మం గుప్త హోటల్ నిర్వాకుల కొత్త ఆలోచన!
జాతీయ జెండారంగులతో టిఫిన్స్
వారి ఆలోచనలపై ప్రసంశలు

 

ఖమ్మం వైరా రోడ్ లో ఉడిపి హోటల్ నిర్వహిస్తున్న దూపుగుంట్ల జోగేశ్వర సత్య భగవాన్ గుప్త,శిరీష దంపతులకు ఒక కొత్త ఆలోచన వచ్చింది . దాన్ని ఆచరణలో పెట్టాలని ప్రయత్నించారు .రిపబ్లిక్ డే సందర్భంగా జాతీయ జెండా ఆకారంలో టిఫీన్ చేసి ప్రజలు అందించాలని భావించారు . వారి హోటల్ లో మన జాతీయ జెండా తరహా లో వారు రోజు అందించే టిఫిన్స్ కు రంగులు చేర్చి వాటిని తయారు చేయడం ఖమ్మం నగరంలో టాక్ ఆఫ్ టౌన్ గా మారింది. వారికీ వచ్చిన ఆలోచనలను వర్కర్స్ కు చెప్పారు . అందరు కలిసి అందంగా టిఫిన్స్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు . వారు చేసిన ఆహార పదార్థాలను , జ్యూస్ ను చూసేందుకు ప్రజలు క్యూకట్టారు . బస్ డిపో ఎదురుగా దశాబ్దాలుగా గుప్త హోటల్ నడుపుతున్నారు . అక్కడ టిఫిన్ కు మంచి డిమాండ్ ఉంటుంది. వారికీ హోటల్ నడపడంలో మంచి అనుభవం ఉండటంతో వైరా రోడ్ లో ఉడిపి ఆహార్ హోటల్ నడుపుతూ శహబాస్ అనిపించు కుంటున్నారు . వారి ఆలోచనలను అందరు ప్రసంశిస్తున్నారు

 

Related posts

ఏపీలో రెండో అధికార భాషగా ఉర్దూకు గుర్తింపు.. నోటిఫికేషన్ జారీ!

Drukpadam

నల్లగొండ నాలుగోవ రౌండ్ ఫలితాలలో అదే వరవడి

Drukpadam

మత విశ్వాసాలను పాటించాల్సింది విద్యా సంస్థల్లో కాదు..: తస్లీమా నస్రీన్

Drukpadam

Leave a Comment