Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం …అన్ని వైసీపీ ఖాతాలోకే …!

ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణకు ముగిసిన గడువు… ఏపీలో ఏకగ్రీవమైన స్థానాలు ఇవే!

  • ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు
  • ఈ నెల 13న పోలింగ్
  • ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఏకగ్రీవం
  • వైసీపీ అభ్యర్థుల విజయకేతనం

ఏపీలో మార్చి 13న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇటీవల నామినేషన్లు దాఖలు కాగా, నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగిసింది. ఈ క్రమంలో, ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఇవన్నీ వైసీపీ బలపరిచిన అభ్యర్థులకే దక్కాయి.

విజేతల వివరాలు…
మేరుగ మురళీధర్- నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
కె.సూర్యనారాయణ- తూర్పు గోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
రామసుబ్బారెడ్డి- కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
డాక్టర్ సుబ్రహ్మణ్యం- చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
మంగమ్మ- అనంతపురం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ

ఐదు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కావడంతో… మిగిలిన 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 13న పోలింగ్ నిర్వహించనున్నారు.

Related posts

కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకన్న దర్శనం చేసుకున్న లోక్ సభ స్పీకర్

Drukpadam

ఏపీలోని కొత్త జిల్లాలకు ఎల్‌జీడీ కోడ్‌ల కేటాయింపు…

Drukpadam

జలాంతర్గామిలో చిన్న లోపంతోనే… చనిపోతామని తెలిసేలోపే గాల్లో కలిసిన ప్రాణాలు!

Drukpadam

Leave a Comment