Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

విజయవాడ రైల్వే ఆసుపత్రిలో రీఫిల్లింగ్ చేస్తుండగా ఆక్సిజన్ లీక్.

విజయవాడ రైల్వే ఆసుపత్రిలో రీఫిల్లింగ్ చేస్తుండగా ఆక్సిజన్ లీక్.. గాల్లో కలిసిన వెయ్యి కిలోలీటర్లు!
  • ఫణి గ్రీష్మ ఏజెన్సీ నుంచి ట్యాంకర్‌లో ఆక్సిజన్
  • దట్టంగా కమ్ముకున్న పొగతో జనం పరుగులు
  • ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు ఉండడంతో తప్పిన ముప్పు

ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తున్న వేళ విజయవాడ రైల్వే ఆసుపత్రిలో వెయ్యి కిలోలీటర్లకు పైగా ఆక్సిజన్ వృథా అయింది. ఆటోనగర్‌లో ఉన్న ఫణి గ్రీష్మ ఏజెన్సీ నుంచి రైల్వే ఆసుపత్రికి ప్రతి రోజూ వెయ్యి కిలోలీటర్ల ఆక్సిజన్ సరఫరా అవుతుంటుంది. నిన్న కూడా ఓ ట్యాంకర్ ఆక్సిజన్ మోసుకొచ్చింది.

ట్యాంకర్‌లోని ఆక్సిజన్‌ను ఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు లీకైంది. దీంతో ఆసుపత్రి ప్రాంగణం మొత్తం తెల్లని పొగలా ఆక్సిజన్ దట్టంగా కమ్మేసింది. దీంతో ఏం జరుగుతుందో తెలియని ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఆక్సిజన్ లీకైనప్పటికీ ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు, కాన్సంట్రేటర్లు ఉండడంతో రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఘటనపై డివిజనల్ రైల్వే మేనేజర్ వివిచారణకు ఆదేశించారు.

Related posts

ఈ నెల్లూరు అమ్మాయే దేశంలో అత్యంత సంపన్నురాలు: సోనూ సూద్

Drukpadam

ప్రపంచవ్యాప్తంగా వివిధ కరోనా టీకాల ధరలు ఇలా ఉన్నాయి!

Drukpadam

ఒమిక్రాన్​ సోకిన మరో వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నాం: మంత్రి హరీశ్ రావు!

Drukpadam

Leave a Comment