Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హర్యానా రైతులపై విరిగిన లాఠీ…

హర్యానా రైతులపై విరిగిన లాఠీ…
-పోలీసుల లాఠీ చార్జీ బాష్పవాయి ప్రయోగం … పలువురి రైతులకు గాయాలు
-కొవిడ్ ఆసుపత్రిని ప్రారంభించేందుకు వెళ్లిన హర్యానా సీఎం
-సాగు చట్టాలు రద్దు చేయాలంటూ ఘెరావ్ చేసిన రైతులు
-పోలీస్ బారికేడ్లను లాగిపారేసిన వైనం
-బాష్పవాయు గోళాలు ప్రయోగంతో పరిస్థితి గందరగోళం
సాగు చట్టాల రద్దుకు రైతుల చేస్తున్న ఉద్యమం పై మరోసారి పోలీస్ ల లాఠీ విరిగింది . హర్యానాలో జరిగిన పోలీస్ లాఠీ ఛార్జ్ , బాష్పవాయి ప్రయోగంలో పలువురు రైతులు గాయపడ్డారు.
కొవిడ్ ఆసుపత్రిని ప్రారంభించేందుకు వెళ్లిన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను రైతులు ఘెరావ్ చేశారు. ఈ ఘటన హర్యానాలోని హన్సిలో ఆదివారం జరిగింది. వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్ తో ఆయన్ను చుట్టుముట్టారు. రైతు చట్టాలు రద్దు చేయాలనీ నినదించారు.

దీంతో రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో రైతులు రెచ్చిపోయి పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను లాగిపారేశారు. దీంతో రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు రైతులు గాయపడ్డారు.

సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని సింఘూ, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరుగుతుండడంతో ఆందోళనను విరమించాలని కేంద్రం విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోలేదు.

Related posts

అంతా బేకార్.. కొత్త పార్లమెంట్ తో ఏం అవసరం?: బీహార్ సీఎం నితీశ్ విమర్శలు…

Drukpadam

ఏపీ లో పరిణామాలపై ఐఏఎస్ అధికారుల సంఘం స్పందించాలి: ఎమ్మెల్సీ అశోక్ బాబు!

Drukpadam

తుమ్మల రాజకీయ చాణిక్యం ఫలిస్తుందా …?

Drukpadam

Leave a Comment