Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సీఎంగా సిద్ధూ.. డిప్యూటీగా డీకే.. ఎల్లుండి ప్రమాణ స్వీకారం: కేసీ వేణుగోపాల్!

సీఎంగా సిద్ధూ.. డిప్యూటీగా డీకే.. ఎల్లుండి ప్రమాణ స్వీకారం: కేసీ వేణుగోపాల్!

  • వచ్చే పార్లమెంట్ ఎన్నికల దాకా కేపీసీసీ చీఫ్ గా శివకుమారే కొనసాగుతారన్న వేణుగోపాల్
  • కాంగ్రెస్ ఏకాభిప్రాయాన్ని నమ్ముతుందని, నియంతృత్వాన్ని కాదని వ్యాఖ్య
  • అందుకే సీఎం ఎవరనే విషయంలో వరుస సమావేశాలు నిర్వహించినట్లు వెల్లడి
  • ఇద్దరూ సీఎం పదవికి సమర్థులైన నేతలన్న కాంగ్రెస్ నేత

కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేస్తారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం 12.30కు బాధ్యతలు స్వీకరిస్తారని ప్రకటించారు. గురువారం తన నివాసంలో సిద్ధరామయ్యతో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. వీరిద్దరితోపాటు కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశం ఉందని తెలిపారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల దాకా కర్ణాటక పీసీసీ చీఫ్ గా డీకే శివకుమారే కొనసాగుతారని తెలిపారు. డిప్యూటీ సీఎంగా ఆయనొక్కరే ఉంటారని చెప్పారు. కాంగ్రెస్ ఏకాభిప్రాయాన్ని నమ్ముతుందని, నియంతృత్వాన్ని కాదని వ్యాఖ్యానించారు. అందుకే సీఎం అభ్యర్థి విషయంలో సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు.

సిద్ధరామయ్య, డీకే శివకుమార్.. ఇద్దరూ సీఎం పదవికి సమర్థులని, ఇద్దరూ తమ పార్టీ పెద్ద ఆస్తి అని చెప్పారు. కర్ణాటక ప్రజలతో అధికారాన్ని పంచుకోవడమే తమ ‘పవర్ షేరింగ్ ఫార్ములా’ అని వేణుగోపాల్ చెప్పారు. 6.5 కోట్ల కన్నడిగులకు ఇచ్చిన 5 హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.

  • కర్ణాటక భవిష్యత్తు, ప్రజల సంక్షేమానికే ప్రాధాన్యతన్న డీకే
  • కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సిద్ధరామయ్యతో ఉన్న ఫొటోను ట్వీట్ చేసిన కేపీసీసీ చీఫ్
  • ఈ రోజు రాత్రి 7 గంటలకు సీఎల్పీ భేటీ ఏర్పాటు చేసినట్లు ప్రకటన
DK Shivakumar tweets after Karnataka CM candidate Name announcement

కర్ణాటక సీఎం ఎవరనే విషయంలో కాంగ్రెస్ లో వారం రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధానికి ఎట్టకేలకు తెరపడింది. సీఎంగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ను కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. తనకు ఇష్టం లేకపోయినా.. పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అధిష్ఠానం నిర్ణయానికి ఓకే చెప్పానని డీకే చెప్పారు.

ఈ నేపథ్యంలో సీఎంగా సిద్ధరామయ్యను ప్రకటించిన తర్వాత డీకే శివకుమార్ ట్వీట్ చేశారు. ‘‘కర్ణాటక సురక్షిత భవిష్యత్తు, ప్రజల సంక్షేమానికే మా మొదటి ప్రాధాన్యత. ఆ హామీ ఇవ్వడంలో మేము ఐక్యంగా ఉన్నాము’’ అని ఆయన పేర్కొన్నారు. తనతోపాటు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, సిద్ధరామయ్య ఉన్న ఫొటోను ట్వీట్ చేశారు.

మరోవైపు సీఎల్పీ నేతను ఎన్నుకునేందుకు ఈ రోజు రాత్రి 7 గంటలకు బెంగళూరులో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు కేపీసీసీ చీఫ్ హోదాలో శివకుమార్ వెల్లడించారు. క్వీన్స్ రోడ్డులోని ఇందిరా గాంధీ భవన్ లో జరిగే భేటీకి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతోపాటు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రావాలని సూచించారు. ఇక శనివారం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో సీఎం, డిప్యూటీ సీఎం, పలువురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Related posts

ఆంధ్ర రాజకీయాల్లోకి ఫైర్ బ్రాండ్ రేణుక చౌదరి …గుడివాడిపై గురి …

Drukpadam

గంగుల ,వద్దిరాజులపై సిబిఐ ప్రశ్నల వర్షం …9 గంటలకు పైగా విచారణ !

Drukpadam

రాష్ట్రపతి ఎన్నిక…ఓట్ల వివరాలు….

Drukpadam

Leave a Comment