Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తల్లితో కలిసి హైదరాబాద్ కు తిరిగొస్తున్న ఎంపీ అవినాశ్ రెడ్డి!

తల్లితో కలిసి హైదరాబాద్ కు తిరిగొస్తున్న ఎంపీ అవినాశ్ రెడ్డి!

  • వివేకా హత్యకేసులో విచారణ ఎదుర్కొంటున్న ఎంపీ అవినాశ్ రెడ్డి
  • నేడు విచారణకు రావాలని కోరిన సీబీఐ
  • తల్లికి బాగాలేదని పులివెందులకు పయనమైన అవినాశ్
  • మార్గమధ్యంలోనే ఎదురొచ్చిన అంబులెన్స్
  • కాన్వాయ్ ఆపి తల్లి శ్రీలక్ష్మిని పరామర్శించిన అవినాశ్

వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇవాళ ఆయన హైదరాబాదులో సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉండగా, తల్లికి అనారోగ్యంగా ఉందంటూ పులివెందుల పయనమయ్యారు.

అవినాశ్ రెడ్డి తల్లి శ్రీలక్ష్మికి గుండెపోటు రావడంతో పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను ప్రత్యేక అంబులెన్స్ లో హైదరాబాద్ తరలిస్తున్నారు.

ఈ అంబులెన్స్ తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద ఎంపీ అవినాశ్ రెడ్డి కాన్వాయ్ కి ఎదురైంది. దాంతో, ఆయన తన కాన్వాయ్ ని ఆపి, అంబులెన్స్ లో ఉన్న తల్లిని పరామర్శించారు. అనంతరం తన కాన్వాయ్ ని మళ్లీ వెనక్కి మళ్లించారు. ప్రస్తుతం అంబులెన్స్ సహా ఎంపీ అవినాశ్ రెడ్డి భారీ కాన్వాయ్ హైదరాబాద్ వస్తోంది.

కాగా, ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లిని తరలిస్తున్న అంబులెన్స్ లో జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సుధీర్ రెడ్డి అనుచరులు ఎంపీ అవినాశ్ రెడ్డి కాన్వాయ్ ను అనుసరించి పలు వాహనాల్లో వస్తున్నట్టు సమాచారం.

కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో అవినాశ్ రెడ్డి తల్లికి చికిత్స

Avinash Reddy mother has been treated in Viswabharathi hospital in Kurnool

వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లిని పులివెందుల నుంచి హైదరాబాద్ తరలిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆమెకు మార్గమధ్యంలో కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స అందించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లిని తొలుత పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం, మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక అంబులెన్స్ లో కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

అటు, ఎంపీ అవినాశ్ రెడ్డి మాజీ ఎంపీ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరు కావాల్సి ఉంది. తల్లి అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. వెంటనే పులివెందుల బయల్దేరారు. తాడిపత్రి మండలం చుక్కలూరు వద్ద తల్లిని తీసుకువస్తున్న అంబులెన్స్ ఎదురుకావడంతో, ఎంపీ అవినాశ్ రెడ్డి తన కాన్వాయ్ ని వెనక్కి తిప్పారు. తల్లి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కర్నూలులో చికిత్స చేయించారు. అనంతరం ఆమెను హైదరాబాద్ తరలించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

Related posts

మా మధ్య చిచ్చు పెట్టొద్దు.. ఢిల్లీ పెద్దలను ఎవరైనా కలవొచ్చు: బండి సంజయ్

Drukpadam

బీహార్ లో ప్రజల రక్తం రుచిమరిగిన బెంగాల్ టైగర్ …ఐదుగురి బలి…

Drukpadam

హైకోర్టులో అవినాశ్ రెడ్డికి ఊరట.. బుధవారం వరకు అరెస్ట్ చేయవద్దని సీబీఐకి ఆదేశం…

Drukpadam

Leave a Comment