రాజకీయ వార్తలు

కవిత, బండి సంజయ్.. ఆప్యాయ పలకరింపులు…

ఒకే చోట కవిత, బండి సంజయ్.. ఆప్యాయ పలకరింపులు

  • నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు లక్ష్మీనరసయ్య గృహప్రవేశ కార్యక్రమం
  • కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్, కవిత
  • వెల్కమ్ టు నిజామాబాద్ అంటూ సంజయ్ ను ఆహ్వానించిన కవిత

బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య పచ్చ గడ్డి వేసినా భగ్గు మంటుంది. అలాంటి రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు ఒకేచోట కలవడం, ఆప్యాయంగా పలకరించుకోవడం ఎప్పుడో కానీ జరగదు. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒక వేడుకలో కలుసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బసవాపురం లక్ష్మీనరసయ్య గృహప్రవేశం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి సంజయ్, కవిత ఇద్దరూ విచ్చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ ఎదురుపడగా ఒకరికొకరు నమస్కారం చేసుకుని, ఆప్యాయంగా పలకరించుకున్నారు. వెల్కమ్ టు నిజామాబాద్ అంటూ బండిని కవిత ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తాతో పాటు స్థానిక బీఆర్ఎస్ నేతలను సంజయ్ కు కవిత పరిచయం చేశారు. బండి సంజయ్ కూడా తమ నేతలను కవితకు పరిచయం చేశారు. వీరి కలయికకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి బదిలీ… తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు!

Drukpadam

తెలంగాణలోనూ శ్రీలంక పరిస్థితే … కేసీఆర్ పాలనపై ఎంపీ కోమటిరెడ్డి ధ్వజం

Drukpadam

కొనేది ఎట్లా.. ? బతికేది ఎట్లా..?పీపుల్స్ మార్చ్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క!

Drukpadam