రాజకీయ వార్తలు

కవిత, బండి సంజయ్.. ఆప్యాయ పలకరింపులు…

ఒకే చోట కవిత, బండి సంజయ్.. ఆప్యాయ పలకరింపులు

  • నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు లక్ష్మీనరసయ్య గృహప్రవేశ కార్యక్రమం
  • కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్, కవిత
  • వెల్కమ్ టు నిజామాబాద్ అంటూ సంజయ్ ను ఆహ్వానించిన కవిత

బీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య పచ్చ గడ్డి వేసినా భగ్గు మంటుంది. అలాంటి రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు ఒకేచోట కలవడం, ఆప్యాయంగా పలకరించుకోవడం ఎప్పుడో కానీ జరగదు. తాజాగా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఒక వేడుకలో కలుసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బసవాపురం లక్ష్మీనరసయ్య గృహప్రవేశం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి సంజయ్, కవిత ఇద్దరూ విచ్చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ ఎదురుపడగా ఒకరికొకరు నమస్కారం చేసుకుని, ఆప్యాయంగా పలకరించుకున్నారు. వెల్కమ్ టు నిజామాబాద్ అంటూ బండిని కవిత ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తాతో పాటు స్థానిక బీఆర్ఎస్ నేతలను సంజయ్ కు కవిత పరిచయం చేశారు. బండి సంజయ్ కూడా తమ నేతలను కవితకు పరిచయం చేశారు. వీరి కలయికకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

త‌ణుకులో హైటెన్ష‌న్‌!… అమ‌రావ‌తి రైతుల యాత్ర‌కు వైసీపీ శ్రేణుల నిర‌స‌న‌!

Drukpadam

ఆదర్శంలో కమ్యూనిస్టులకు సాటి మరెవరు లేరు …సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు!

Drukpadam

అమెరికాలో మొబైల్ లాక్కున్న టీచర్ పై పెప్పర్ స్ప్రేతో స్టూడెంట్ దాడి.. !

Drukpadam