Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పని చేయలేకుంటే తప్పుకోండి.. పార్టీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక..!

పని చేయలేకుంటే తప్పుకోండి.. పార్టీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక..!

  • పని చేయని నేతలకు పార్టీలో స్థానం ఉండదని స్పష్టం చేసిన చంద్రబాబు
  • వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసేలా సిద్ధంగా ఉండాలని సూచన 
  • తెలుగుదేశం మినీ మేనిఫెస్టోపై ఇంటింటా చర్చ జరగేలా చేయాలని దిశానిర్దేశం
  • దసరా రోజున మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు వెల్లడి
పార్టీ నేతలకు టీడీపీ అధినేత చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. పని చేయని నేతలకు పార్టీలో స్థానం ఉండదని స్పష్టం చేశారు. సోమవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ‘‘పార్టీ కార్యక్రమాల విషయంలో అలక్ష్యం వద్దు. పని చేయలేని వారుంటే ఇప్పుడే తప్పుకోవాలి. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే ప్రత్యామ్నాయ నాయకులను చూసుకుంటాం’’ అని తేల్చిచెప్పారు.

‘‘నేను ఇప్పుడు గట్టిగా మాట్లాడడం లేదని అనుకోవద్దు. పని చేయకుంటే గట్టిగానే చర్యలు తీసుకుంటాను. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసేలా నాయకులు సిద్ధంగా ఉండాలి. గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి’’ అని సూచించారు. తెలుగుదేశం మినీ మేనిఫెస్టోపై ఇంటింటా చర్చ జరగాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రజల మనోభావాల ప్రకారం సమస్యలను తెలుసుకోవాలని సూచించారు.

మరోవైపు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెట్టేలా కృషి చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. బీసీ నేతలకు అగ్రపీఠం వేసింది తెలుగుదేశమే అని గుర్తుచేశారు. దసరా రోజున విడుదల చేయనున్న మేనిఫెస్టోలో బీసీల కోసం ఏం చేయబోతున్నామో చెబుతామని వెల్లడించారు. ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం ఏదో బటన్ నొక్కుతానంటోందని ఎద్దేవా చేశారు. బటన్ నొక్కే వ్యవస్థని తెచ్చిందే తెలుగుదేశం అని గుర్తుచేశారు.

పులివెందులను కొట్టి తీరుతాం: చంద్రబాబు సవాల్

Chandra babu fires on ys Jagan

 

ఎవరికో పుట్టిన బిడ్డను తనకే పుట్టాడని చెప్పుకునే వ్యక్తి ఏపీ సీఎం జగన్ అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. టిడ్కో ఇళ్లు తానే కట్టానని జగన్ చేసిన వ్యాఖ్యలే అందుకు ఉదాహరణ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు ప్రసంగించారు.

తెలుగుదేశం ఒరిజినాలిటీతో ఉండే పార్టీ అని, వైసీపీ అతుకుల బొంత అని చంద్రబాబు విమర్శించారు. కుప్పంలో గెలవడం వైఎస్సార్ సీపీతో జరిగే పని కాదని, పులివెందులను కొట్టి తీరతామని సవాల్ చేశారు. ‘‘జగన్ 98 శాతం హామీలు అమలు చేయకుండా.. రాష్ట్రాన్ని 98 శాతం లూటీ చేశాడు. ఈ ప్రభుత్వం ఇంకా కొనసాగితే ఏపీ పరిస్థితి నార్త్ కొరియాలా తయారవుతుంది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యుత్ వ్యవస్థను అవినీతిమయం చేసి పేదలపై భారం మోపారని, ముఖ్యమంత్రి అసమర్థత వల్లే ప్రజల ఆదాయం తగ్గి, ధరలు పెరిగాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో భూమి విలువలు తగ్గి, రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగాయని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీల తగ్గింపు విధానానికి శ్రీకారం చుడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

పేదలు, రైతులపై విద్యుత్ భారం తగ్గేలా నూతన విధానాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించారు. గతంలోనూ విద్యుత్ ఉత్పత్తి ధరలను తగ్గించామన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థని నాశనం చేసి ఏడు సార్లు చార్జీలు పెంచేసిందని ధ్వజమెత్తారు. ఇంటి పన్ను, చెత్తపన్ను.. ఇలా అన్నింటినీ పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts

మోదీకి దమ్ముంటే యడియూరప్పపై విచారణ జరిపించాలి: సిద్ధరామయ్య!

Drukpadam

సూరులో పాము దూరిందని ఇల్లు తగల బెట్టుకున్న చందంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు …

Drukpadam

వివేకా హత్యతో అవినాష్‌రెడ్డికి సంబంధం లేదు!

Drukpadam

Leave a Comment