Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

 ప్రతికూల వాతావరణం నేపథ్యంలో.. శంషాబాద్‌లో ఖతార్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

  • దోహా నుంచి నాగ్‌పూర్ వెళ్తున్న విమానం
  • నాగ్‌పూర్‌లో ల్యాండింగ్‌కు అనుకూలంగా లేని వాతావరణం
  • విమానంలో 160మంది ప్రయాణికులు

దుబాయ్‌లోని దోహా నుంచి నాగ్‌పూర్ వెళ్తున్న ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానం శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండైంది. దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నాగ్‌పూర్‌లోనూ పరిస్థితి అందుకు భిన్నంగా ఏమీ లేదు. 

విమానం ల్యాండింగ్‌కు అక్కడ వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో విమానాన్ని హైదరాబాద్‌కు మళ్లించి, శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ చేశారు. అందులోని 160 మంది ప్రయాణికులను నోవాటెల్‌కు తరలించారు. వాతావరణం అనుకూలించి, విమానానికి అనుమతులు వచ్చిన తర్వాత విమానం తిరిగి నాగ్‌పూర్ బయలుదేరుతుందని అధికారులు తెలిపారు.

Related posts

భారత్-కెనడా ఉద్రిక్తతలపై జస్టిన్ ట్రూడోతో ఫోన్‌లో మాట్లాడిన రిషిసునక్

Ram Narayana

హెచ్ 1 బి వీసా రెన్యూవల్ ఇకపై అమెరికాలోనే.. వచ్చే జనవరి నుంచే అమలు

Ram Narayana

సరబ్‌జీత్‌సింగ్‌పై పాక్ జైలులో దాడిచేసిన అండర్ వరల్డ్ డాన్ అమీర్ సర్ఫరాజ్‌ కాల్చివేత…

Ram Narayana

Leave a Comment