Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

 వల్లభనేని వంశీ కాన్వాయ్‌కి సూర్యాపేట జిల్లాలో ప్రమాదం!

  • విజయవాడ-హైదరాబాద్ 65వ జాతీయ రహదారిలోని కాశీంపేట వద్ద ఘటన
  • ఉదయం విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తోన్న ఎమ్మెల్యే
  • కాన్వాయ్‌లోని రెండు వాహనాలు ఢీ.. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు

గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ కాన్వాయ్‌కి ప్రమాదం జరిగింది. విజయవాడ- హైదరాబాద్ 65వ జాతీయ రహదారిలో సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కాశీంపేట వద్ద ఈ సంఘటన జరిగింది. వల్లభనేని వంశీ శనివారం ఉదయం కాన్వాయ్‌లో విజయవాడ నుండి హైదరాబాద్‌కు బయలుదేరారు. తెలంగాణ రాష్ట్రంలోని కాశీంపేట వద్ద ఈ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్‌లోని చివరి రెండు వాహనాలు ఒకదానికొకటి పరస్పరం ఢీకొన్నాయి. అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. కానీ రెండు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయి.

Related posts

భద్రాచలం వద్ద ఐదు ఊళ్ళు ఇవ్వాలని ప్రధానిని కోరాం…డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana

చంద్రబాబు అరెస్ట్ ను కేసీఆర్ ఖండించాలి…మద్దతుగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద దీక్ష ..మోత్కుపల్లి…

Ram Narayana

పదకొండేళ్ల చిన్నారికి గుండె మార్పిడి

Ram Narayana

Leave a Comment