Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కాంగ్రెస్‌కు నాయకుల్లేరు, బీజేపీకి కేడర్ లేదు: హరీశ్ రావు

  • వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా
  • కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారన్న హరీశ్ రావు
  • తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలవి మేకపోతు గాంభీర్యమని వ్యాఖ్య

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని, కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని మంత్రి హరీశ్ రావు అన్నారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ నెల 23న సీఎం కేసీఆర్‌ మెదక్‌ జిల్లాలో పర్యటించనున్నట్లు చెప్పారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతో పాటు బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారన్నారు. కొన్ని రాష్ట్రాల అధికారులు, మంత్రులు వచ్చి సమీకృత కలెక్టరేట్‌ను పరిశీలించారన్నారు. అన్ని కార్యాలయాలు ఒకేచోట ఉండడంతో వివిధ సమస్యలు పరిష్కరించుకోవచ్చునని చెప్పారు.

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయన్నారు. కేసీఆర్ మూడోసారి సీఎం కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీకి లీడర్లు లేరని, బీజేపీకి క్యాడర్ లేదని ఎద్దేవా చేశారు. కానీ తమ పార్టీకి తిరుగులేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పాలనను ప్రజలు గమనిస్తున్నారన్నారు. తాము 24 గంటల విద్యుత్ అంటే నమ్మలేదని, కానీ ఇచ్చి చూపించామన్నారు. కాంగ్రెస్, బీజేపీలు కేసీఆర్‌ను తిట్టడంలో బిజీగా ఉంటే కేసీఆర్ వడ్లు పండించడంలో బిజీగా ఉన్నారన్నారు. కేసీఆర్ సీఎం అయ్యాకే మెదక్ జిల్లా కల నెరవేరిందన్నారు.

రూ.1 లక్ష లోపు రుణ ప్రకటన ద్వారా 30 లక్షల కుటుంబాలకు రుణమాఫీ జరిగిందన్నారు. ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని కేసీఆర్ ఆదేశించారన్నారు. త్వరలో రూ.1 లక్షకు పైగా ఉన్న వారికి రుణమాఫీ చేస్తామన్నారు. బీఆర్ఎస్ పథకాలను చూసి కాంగ్రెస్ బేజారవుతోందన్నారు. మైనార్టీల సంక్షేమానికి, బీసీ కులవృత్తులకు మద్దతుగా నిలిచామన్నారు.

Related posts

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ గుర్తింపు రద్దు చేయాలి…కిషన్ రెడ్డి

Ram Narayana

కేసీఆర్ తో తలపడే అభ్యర్థిపై కాంగ్రెస్ సస్పెన్స్

Ram Narayana

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభంజనంలో బీఆర్ యస్ కొట్టుకొని పోవడం ఖాయం..పొంగులేటి,తుమ్మల ,సిపిఐ నారాయణ …

Ram Narayana

Leave a Comment