Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

కెనడాలో కూలిన శిక్షణ విమానం, ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్ల మృతి

  • బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో కూలిన విమానం
  • ముంబైకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి మృతి
  • ప్రమాద ఘటనపై విచారణ జరుపుతోన్న సేఫ్టీ బోర్డు

కెనడాలో ఓ శిక్షణ విమానం కూలిన ఘటనలో ఇద్దరు భారతీయులు మృతి చెందారు. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని చిల్లివాక్ సిటీ విమానాశ్రయానికి సమీపంలో ఈ శిక్షణ విమానం కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఇందులో ఇద్దరు భారతీయ ట్రెయినీ పైలట్లు ఉన్నారు. శిక్షణలో ఉన్న హైపర్ పీఏ-4 సెనెకా లైట్ వెయిట్ ఎయిర్ క్రాఫ్ట్ శనివారం హఠాత్తుగా పొదల్లోకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో ముంబైకి చెందిన అభయ్ గద్రూ, యశ్ విజయ్ మృతి చెందినట్లు మీడియాలో వచ్చింది. వీరిద్దరు ఒకే కుటుంబానికి చెందినవారుగా చెబుతున్నారు. ఈ ఘటనలో ఈ ముగ్గురు పైలట్లకు మినహా ఎవరికీ ఏమీ కాలేదు. విమానం కూలిన ఘటనపై కెనడా ట్రాన్సుపోర్టేషన్ సేఫ్టీ బోర్డు విచారణ జరుపుతోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Related posts

ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం .. అమెరికాకు 60 విమానాలు రద్దు…

Ram Narayana

కెన‌డాలో ఖలిస్థానీ గ్రూప్ దుశ్చ‌ర్య‌..ఆలయంలో హిందూ భక్తులపై దాడి.. ఖండించిన ప్ర‌ధాని ట్రూడో!

Ram Narayana

ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనాకు మద్దతిచ్చిన భారత్

Ram Narayana

Leave a Comment