అంతర్జాతీయం

కెనడాలో కూలిన శిక్షణ విమానం, ఇద్దరు భారతీయ ట్రైనీ పైలట్ల మృతి

  • బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో కూలిన విమానం
  • ముంబైకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి మృతి
  • ప్రమాద ఘటనపై విచారణ జరుపుతోన్న సేఫ్టీ బోర్డు

కెనడాలో ఓ శిక్షణ విమానం కూలిన ఘటనలో ఇద్దరు భారతీయులు మృతి చెందారు. బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లోని చిల్లివాక్ సిటీ విమానాశ్రయానికి సమీపంలో ఈ శిక్షణ విమానం కూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఇందులో ఇద్దరు భారతీయ ట్రెయినీ పైలట్లు ఉన్నారు. శిక్షణలో ఉన్న హైపర్ పీఏ-4 సెనెకా లైట్ వెయిట్ ఎయిర్ క్రాఫ్ట్ శనివారం హఠాత్తుగా పొదల్లోకి దూసుకెళ్లింది.

ఈ ఘటనలో ముంబైకి చెందిన అభయ్ గద్రూ, యశ్ విజయ్ మృతి చెందినట్లు మీడియాలో వచ్చింది. వీరిద్దరు ఒకే కుటుంబానికి చెందినవారుగా చెబుతున్నారు. ఈ ఘటనలో ఈ ముగ్గురు పైలట్లకు మినహా ఎవరికీ ఏమీ కాలేదు. విమానం కూలిన ఘటనపై కెనడా ట్రాన్సుపోర్టేషన్ సేఫ్టీ బోర్డు విచారణ జరుపుతోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Related posts

స్కూల్ లోకి టీచర్లు తుపాకులు తీసుకెళ్లొచ్చట.. బిల్ పాస్ చేసిన అమెరికాలోని టెన్నెస్సీ హౌస్

Ram Narayana

12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పడిపోయిన ప‌సిడి ధర.. భారీగా దిగివచ్చిన రేట్లు!

Ram Narayana

నేను ఆపకుంటే భారత్, పాక్ మధ్య అణుయుద్ధం జరిగేది: ట్రంప్

Ram Narayana