Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

మంత్రి పువ్వాడ అజయ్ వాహనంలో ఎన్నికల అధికారుల తనిఖీలు

  • రఘునాధపాలెం నుంచి కోయచలక గ్రామానికి వెళ్తుండగా వాహనం తనిఖీ
  • సహకరించిన మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు
  • ఎన్నికల నియమావళిలో ఇలాంటివి సాధారణమేనన్న మంత్రి

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో సామాన్యులతోపాటు ప్రచారపర్వంలో ఉన్న ప్రజాప్రతినిధుల వాహనాలనూ అధికారులు వదలడం లేదు. తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు కూడా ఈ పరిస్థితి ఎదురైంది. ఆయన వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. రఘునాధపాలెం నుంచి కోయచలక గ్రామంలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న ఆయన వాహనాన్ని కోయచలక క్రాస్ రోడ్ వద్ద పరిశీలించారు. 

ఆ సమయంలో మంత్రి అజయ్ వెంట డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణంతోపాటు ఇతర ప్రజా ప్రతినిధులు ఉన్నారు. వీరంతా ఎన్నికల అధికారుల తనిఖీలకు సంపూర్ణంగా సహకరించారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా మంత్రి తెలియజేశారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున విధి నిర్వహణలో ఇలాంటి తనిఖీలు సర్వ సాధారణమేనని అజయ్ వ్యాఖ్యానించారు. తాను అధికారులకు ఎప్పుడైనా సహకరిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా బీఆర్ఎస్ తరపున ఖమ్మం నియోజకవర్గం నుంచి పువ్వాడ అజయ్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే.

Related posts

సత్తుపల్లి ,వైరా ,మధిర నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు భట్టి ,తుమ్మల,పొంగులేటి ప్రచారం

Ram Narayana

పాలేరు ,ఖమ్మంలలో కాంగ్రెస్ జెండా ఎగరాలి …తుమ్మల , పొంగులేటి

Ram Narayana

నిరంతరం ప్రజా సేవలోనే ఉంటాం-అన్నా అంటే అండగా నిలుస్తా మంత్రి పొంగులేటి!

Ram Narayana

Leave a Comment