ఖమ్మం వార్తలు

పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్

పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్
శీనన్న తరపున నామినేషన్ దాఖలు చేసిన సోదరుడు ప్రసాద్ రెడ్డి

పాలేరు అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తరఫున ఆయన సోదరుడు పొoగులేటి ప్రసాద్ రెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నిoగ్ అధికారి రాజేశ్వరికి ఖమ్మం రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ ప్రతులు అందజేశారు. ఆయన వెంట కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, జిల్లా నాయకులు బైరు హరినాథబాబు, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు బొడ్డు బొందయ్య, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడిత్యా పెట్రామ్ నాయక్ ఉన్నారు.

9వ తేదీన శీనన్నమరో సెట్ నామినేషన్ దాఖలు..

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తరఫున నామినేషన్ దాఖలు చేశాక.. విలేకరులతో పొoగులేటి ప్రసాద్ రెడ్డి మాట్లాడారు. పాలేరు ప్రజలు శీనన్నను భారీ మెజారిటీతో గెలిపించుకోబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈనెల 9వ తేదీన పొంగులేటి శీనన్న పాలేరు ఎన్నికల కార్యాలయానికి వచ్చి స్వయంగా తన నామినేషన్ దాఖలు చేస్తారని ప్రకటించారు.రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని శీనన్నకు భారీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ..

Related posts

ఈనెల 25 న ఖమ్మంలో భట్టి పీపుల్స్ మార్చ్ ముగింపు సభ …-నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ …

Drukpadam

మీడియాలో వస్తున్నవార్తలపై అధికారులు వెంటనే స్పందించాలి …ఖమ్మం జిల్లా కలెక్టర్

Ram Narayana

ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ లో సీట్ల కొట్లాట….

Drukpadam