తెలంగాణ రాజకీయ వార్తలు ..

కేసీఆర్‌తో భేటీకి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖరరెడ్డి, సుధీర్ రెడ్డిల గైర్హాజరు

  • ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో సమావేశం
  • కేసీఆర్‌తో భేటీకి మల్లారెడ్డి సహా ముగ్గురు దూరం
  • ముగ్గురు ఎమ్మెల్యేల గైర్హాజరీపై చర్చ

బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సోమవారం మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అంతకుముందు బీఆర్ఎస్ భవన్‌లో వారు కేటీఆర్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. ఈ సందర్భంగా వారు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అయితే కేసీఆర్‌తో జరిగిన ఈ భేటీకి మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి, సుధీర్ రెడ్డిలు హాజరు కాలేదు. బీఆర్ఎస్ సమావేశానికి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంపై చర్చ సాగుతోంది.

Related posts

స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకు ఇవ్వాలంటూ ప్రగతిభవన్ కు సర్పంచ్ నవ్య

Ram Narayana

అనర్హత వేటు భయం.. రాజీనామా బాటలో దానం, కడియం?

Ram Narayana

మార్పును కోరుకున్న ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందాం …డిప్యూటీ సీఎం భట్టి

Ram Narayana