తెలంగాణ రాజకీయ వార్తలు ..

కేసీఆర్‌తో భేటీకి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖరరెడ్డి, సుధీర్ రెడ్డిల గైర్హాజరు

  • ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో సమావేశం
  • కేసీఆర్‌తో భేటీకి మల్లారెడ్డి సహా ముగ్గురు దూరం
  • ముగ్గురు ఎమ్మెల్యేల గైర్హాజరీపై చర్చ

బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు సోమవారం మధ్యాహ్నం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సమావేశమయ్యారు. అంతకుముందు బీఆర్ఎస్ భవన్‌లో వారు కేటీఆర్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. ఈ సందర్భంగా వారు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అయితే కేసీఆర్‌తో జరిగిన ఈ భేటీకి మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర రెడ్డి, సుధీర్ రెడ్డిలు హాజరు కాలేదు. బీఆర్ఎస్ సమావేశానికి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడంపై చర్చ సాగుతోంది.

Related posts

రైతు భరోసాపై తుమ్మల నాగేశ్వరరావు చేతులెత్తేస్తున్నట్లుగా ఉంది … కేటీఆర్

Ram Narayana

తెలంగాణ నుంచి సోనియాగాంధీ పోటీ చేయాలని కోరుతూ తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

రేపు లేదా ఎల్లుండి మిగతా అభ్యర్థుల జాబితా: కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ

Ram Narayana