అధికారిక నివాసం ప్రజాభవన్లోకి కుటుంబ సమేతంగా అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- గురువారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించిన భట్టి కుటుంబం
- పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భట్టి కుటుంబ సభ్యులు, అనుచరులు, కార్యకర్తలు
- సోషల్ మీడియా వేదికగా ఫొటోలు పంచుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం
![Deputy CM Bhatti Vikramarka entered the official residence Praja Bhavan along with his family](https://i0.wp.com/img.ap7am.com/bimg/cr-20231214tn657a8437004d9.jpg?w=1400&ssl=1)
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, అర్థిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సమేతంగా అధికారిక నివాసం ‘మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజా భవన్’లోకి అడుగుపెట్టారు. ఇందుకు సంబంధించి గురువారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలో కూడా పూజలు చేశారు. ఆ తర్వాత తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి వెళ్లారు. కాగా పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను భట్టి విక్రమార్క సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ కార్యక్రమాల్లో భట్టి భార్య, ఇతర కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులు, కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
కాగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం అధికారిక నివాసంగా ప్రజాభవన్ ఉండేది. అయితే సీఎం నివాసాన్ని వేరే ప్రాంతానికి మార్చాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోంది. అందుకే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు అధికారిక నివాసంగా ప్రజాభవన్ను కేటాయించింది. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున ఆయన కుటుంబ సమేతంగా అడుగుపెట్టారు.
![](https://i0.wp.com/drukpadam.com/wp-content/uploads/2023/12/prajabhavan.hyd_-1.jpeg?resize=318%2C159&ssl=1)