Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

నిరాహారదీక్షకు దిగిన కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడు

  • ఐదేళ్లుగా జైల్లోనే ఉన్న కోడికత్తి శ్రీను
  • జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని శ్రీను తల్లి, సోదరుడి డిమాండ్
  • లేకపోతే ఎన్వోసీ ఇచ్చి కేసును ఉపసంహరించుకోవాలని విన్నపం

గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్ పోర్టులో సీఎం జగన్ పై కోడికత్తితో దాడి చేసిన ఘటనలో శ్రీను జైలు జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్లుగా ఆయన విశాఖ జైల్లోనే మగ్గిపోతున్నాడు. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ శ్రీను తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు నిరాహారదీక్షకు దిగారు. దీక్షకు పోలీసుల అనుమతులు లేకపోవడంతో విజయవాడలోని ఇంట్లోనే నిరశన దీక్ష చేపట్టారు. 

ఈ సందర్భంగా శ్రీను తల్లి సావిత్రి మాట్లాడుతూ… తమకు న్యాయం జరిగేంత వరకు దీక్ష చేపడతామని చెప్పారు. ఈ కేసులో కోర్టుకు వచ్చి జగన్ సాక్ష్యం చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎన్వోసీ ఇచ్చి కేసును ఉపసంహరించుకోవాలని అన్నారు. తమకు ప్రజా సంఘాలు మద్దతును ఇవ్వాలని కోరారు. మరోవైపు విశాఖ సెంట్రల్ జైల్లో శ్రీను నిరాహార దీక్షకు కూర్చోనున్నాడు.

Related posts

మరో ఎన్నికల నగారా…57 రాజ్య‌స‌భ సీట్ల ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌ల‌…

Drukpadam

ఎన్నికల్లో డబ్బు పంపిణి పై హై కోర్టులో కవితకు ఊరట … ఆరునెలల జైలు శిక్ష పై స్టే!

Drukpadam

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు సస్పెన్షన్ కు విహెచ్ ఎస్ డిమాండ్ …

Drukpadam

Leave a Comment