Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

రాష్ట్ర రెవిన్యూ మంత్రి పొంగేలేటి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు వెళుతున్న ఫ్లైట్ కు సాంకేతిక లోపం …

నిన్ననే నాల్గవ దశలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి…ఖమ్మం,మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో గత 20 రోజులుగా నిర్వీరంగా పనిచేసిన మంత్రి పొంగులేటి ,ఎమ్మెల్యేలు శబరిమలై దేవుని దర్శనానికి మంగళవారం ఉదయం 9 .55 నిమిషాల ఇండిగో ఫ్లైట్ కు బుక్ చేసుకున్నారు …అందుకోసం వారు గంట ముందుగానే ఎయిర్ పోర్ట్ కు వెళ్లారు …చెక్ ఇన్ అంతరం ఫ్లైట్ ఎక్కారు కానీ అంది ఎయిర్ పోర్ట్ లోనే మొరాయించింది ….దీంతో గంటల తరబడి ఫ్లైట్ కోసం ఎదురు చూస్తున్నారు ..

ఖమ్మం జిల్లా పాలేరు ఎమ్మెల్యే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు , డాక్టర్ తెల్లం వెంకట్రావు ,జారే ఆదినారాయణ వెళుతున్న ఫ్లైట్ కు సాంకేతిక లోపం …వెనక్కు తిరిగివచ్చిన ఫ్లైట్ … మంత్రితోపాటు రాష్ట్ర హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు ,కాంగ్రెస్ నాయకులు తుళ్లూరు బ్రహ్మయ్య లు కూడా ఉన్నారు .. ఎన్నికల అనంతరం కేరళ రాష్ట్రంలోని శబరిమలై వెళుతున్న ఫ్లైట్ కు సాంకేతిక లోపం తో రన్ వే నుంచి వెనక్కు వచ్చారు ..లోపాన్ని గుర్తించిన ఫైలెట్ గాలిలోకి లేవక ముందే తిరిగి వెనక్కు తీసుకోని వచ్చారు ..విమానం మరమ్మత్తుల అనంతరం తిరిగి బయలుదేరుతుండగా మరో సారి సాంకేతిక లోపం ఏర్పడటంతో మంత్రి ఎమ్మెల్యేలు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోనే విమానం కోసం వారు రెండు గంటలుగా ఎదురు చూస్తూ ఉన్నారు ..

Related posts

 కోమటిరెడ్డి ఫోన్ నుంచి వంద సార్లు ఫోన్ చేసినా వికాస్ రాజ్ ఎత్తలేదు: రేవంత్ రెడ్డి

Ram Narayana

మంత్రి తుమ్మల తొలి సంతకం…..

Ram Narayana

జర్నలిస్టుల సమస్యల పరిష్కరిస్తాం …. టీయూడబ్ల్యూజే నేతలకు సీఎం రేవంత్ హామీ ….

Ram Narayana

Leave a Comment