Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

నాగార్జునసాగర్ ఉపఎన్నికపై కాంగ్రెస్ దృష్టి

నాగార్జునసాగర్ ఉపఎన్నికపై కాంగ్రెస్ దృష్టి
-గెలుపై లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయం
-జానారెడ్డి నే పోటీచేయమంటున్న అధిష్టానం
-తనయిడికోసం జానా పట్టు
కాంగ్రెస్ పార్టీలో సాగర్ ఉపఎన్నిక పై ఫోకస్ పెరిగింది . నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికే లక్ష్యంగా పనిచేయాలని నిర్ణయించింది . అప్పటివరకు రాష్ట్ర నేతలంతా ఐక్యంగా పనిచేయాలని అధిష్టానం ఆదేశాలు జారీచేసింది . టీపీసీసీ చీఫ్ ఎంపిక కూడా దాదాపు వాయిదా పడినట్లు తెలుస్తుంది . సాగర్ లో గెలుపే లక్ష్యం గా పనిచేయాలని పీసీసీ నేతలు నిర్ణయించారు . టీ ఆర్ యస్ ఎమ్మెల్యే నోముల నరిసింహయ్య ఆకస్మిక మరణంతో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉపఎన్నిక అనివార్యం అయింది . 2018 జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన కుందూరి జానారెడ్డి ఓటమి చెందారు . అంతకు ముందు ఆయన అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు . అధికార టీ ఆర్ యస్ కు ఏదురు దెబ్బలు తగులు తున్న ప్రస్తుత తరుణంలో , జరుగుతున్న ఈ ఉపఎన్నికకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది . దుబ్బాక ఉప ఎన్నిక లో గెలుపు ద్వారా హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించటం తో బీజేపీ సాగర్ ఎన్నికలలో సత్తా చాటాలని చూస్తుంది . టీపీసీసీ చీఫ్ గా ఉన్న ఉత్తమకుమార్ రెడ్డి రాజీనామా చేయటంతో పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక జరగాల్సి ఉండగా , గత నెలరోజులుగా కసరత్తు జరుగుతుంది . రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ రాష్టంలో కాంగ్రెస్ నేతలతో సుదీర్ఘ మంతనాలు , అభిప్రాయాల సేకరణ అనంతరం తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితులను హైకమాండ్ కు తెలియ జేశారు . రేపో మాపో అధ్యక్షుడి ని నియమిస్తారనగా సాగర్ ఉప ఎన్నిక రావటంతో ఆఎన్నిక తరువాత టీపీసీసీ చీఫ్ ను నియమించాలని సీనియర్ నేత జానారెడ్డి హైకమాండ్ కు విజ్ఞప్తి చేశారు . దీంతో రంగంలోకి దిగిన హైకమాండ్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ ను రాష్ట్ర ముఖ్య నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకోవని కోరింది . దీంతో ఆయన ఉత్తమకుమార్ రెడ్డి , బట్టి విక్రమార్క , రేవంత్ రెడ్డి , పొన్నం ప్రభాకర్ , జట్టి కుసుమకుమార్ లతో వర్చువల్ మీటింగ్ లో మాట్లాడిన ఆయన పీసీసీ అధ్యక్షుడి ఎంపికను సాగర్ ఉప ఎన్నిక వరకు వాయిదా వేయాలనే నిర్యానికి వచ్చినట్లు సమాచారం . ఆయనతో సమావేశమైన నాయకులు కూడా ఆయనకు అదే సూచించినట్లు తెలుస్తుంది . నాగార్జునసాగర్ ఉపఎన్నికలలో పోటీ ఎవరు చేసిన అందరు కలిసి పనిచేయాలని అందుకు ప్రత్యేక సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలనీ నిర్ణయించినట్లు తెలుస్తుంది . అధిష్టానం తిరిగి జానారెడ్డి నే పోటీచేయాలని కోరుతుండగా ఆయన మాత్రం తన కుమారుడు రఘువీర్ రెడ్డి ని రంగంలోకి దించాలని చూస్తున్నారు . అధిష్టానం ఏమి చెప్పిన సాగర్ లో మాత్రం జానారెడ్డి చెప్పిందే తుది నిర్ణయంగా ఉంటుందని కాంగ్రెస్ నేతలే అంటున్నారు . ఇప్పటికే పీసీసీ పదవికోసం గ్రూప్ లు గా ఉన్న కాంగ్రెస్ పార్టీ లో సాగర్ ఎన్నిక ఐక్యతను తీసుకొస్తుందేమో చూడాలి !!!

Related posts

పచ్చని పల్లెల్లో నారా లోకేశ్ చిచ్చు : ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫైర్!

Drukpadam

ఖమ్మం లో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా బంద్ నిర్వహించిన అఖిలపక్షం!

Drukpadam

ఖమ్మం మేయర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోట్ల మాధవి ?

Drukpadam

Leave a Comment