Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణ కాంగ్రెస్ లో హనుమంతరావు లొల్లి ….

తెలంగాణ కాంగ్రెస్ లో హనుమంతరావు లొల్లి ….
తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ గోల.. మాణికం ఠాగూర్‌కు హనుమంతరావు లేఖ
మాణికం ఠాగూర్‌పై వీహెచ్ ధ్వజం
కేరళలో అయితే పార్టీ ఓడిన వెంటనే పీసీసీ చీఫ్‌ను మార్చేశారన్న హనుమంతరావు
సీనియర్ల అభిప్రాయాలు తీసుకోకుండా పీసీసీ చీఫ్ ప్రకటన వద్దని డిమాండ్
తెలంగాణ కాంగ్రెస్ లో వి హెచ్ గా పేరు ఉన్న హనుమంతరావు లొల్లి ఎక్కువైందని అభిప్రాయాలు ఉన్నాయి. పీసీసీ చీఫ్ గా ఎవరిని నియమించాలనే దానిపై హైకమాండ్ గత సంవత్సర కాలంగా తర్జనభర్జన పడుతుంది. ఫలానా పేరు అని బయటకు వస్తే దానిపై పలువురు రాద్దాతం …. జరుగుతుంది. ….ప్రత్యేకంగా రేవంత్ రెడ్డిని నియమించవద్దని వి హెచ్ లాంటి వారి కోరుతున్నారు.

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి నియామాకం ఖాయమన్న వార్తల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్‌లో మరోమారు కలకలం రేగింది. సీనియర్లతో చర్చించకుండా అధ్యక్షుడి నియామకం వద్దంటూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్‌కు సీనియర్ నేత వి.హనుమంతరావు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014 నుంచి ఇప్పటి వరకు పార్టీలో అంతర్గత సమీక్ష అన్నదే జరగలేదని పేర్కొన్నారు. కేరళలో పార్టీ ఓటమి చెందగానే పీసీసీ చీఫ్‌ను మార్చేశారని, కానీ ఇక్కడ అలాంటి ఊసే లేదని విమర్శించారు.

మాణికం ఠాగూర్ పేరుకే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ అనీ, కానీ ఇక్కడి వ్యవహారాలను ఆయన ఏమాత్రం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. 2023 ఎన్నికలే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడినైన తనను దుర్భాషలాడుతున్నా పట్టించుకునే వారే లేరని హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి నిర్ణయం తీసుకుంటే అందరం కలిసి పనిచేస్తామన్న వీహెచ్.. తెలంగాణ పీసీసీ చీఫ్ ప్రకటనకు ముందు సీనియర్లతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts

నయీంకే భయపడలేదు.. నీకు భయపడతానా?: సీఎం కేసీఆర్​పై ఈటల రాజేందర్​ ఫైర్​!

Drukpadam

ఖమ్మం రానున్న మాణిక్యం ఠాకూర్

Drukpadam

పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల బరిలో మమతా బెనర్జీ : ఈనెల 30 ఎన్నిక!

Drukpadam

Leave a Comment