జాతీయ రాజకీయ వార్తలు

ఎంపీ హోదాలో తొలిసారి వయనాడ్‌కు ప్రియాంక గాంధీ!

  • ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో ప్రియాంక గాంధీ విజయం
  • రెండు రోజుల క్రితం ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రియాంక గాంధీ
  • రాహుల్ గాంధీతో కలిసి వయనాడ్‌లో బహిరంగ సభకు హాజరు

ఏఐసీసీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ ఎంపీ హోదాలో తొలిసారి వయనాడ్‌లో అడుగు పెట్టారు. ఇటీవల జరిగిన వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో ఆమె భారీ మెజార్టీతో విజయం సాధించారు. రెండు రోజుల క్రితం ఎంపీగా ప్రమాణం చేశారు. ఈ నేపథ్యంలో తనను గెలిపించిన నియోజకవర్గానికి ఎంపీ హోదాలో వెళ్లారు.

తన సోదరుడు, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో కలిసి శనివారం ఉదయం ఆమె కేరళ చేరుకున్నారు. వయనాడ్‌లోని ముక్కంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఆమె రెండు రోజుల పాటు వయనాడ్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 

ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో సమీప సీపీఐ అభ్యర్థి సత్యన్ మొకేరిపై ప్రియాంక గాంధీ 4 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్‌కు దాదాపు లక్షా పదివేల ఓట్లు పడ్డాయి. సీపీఐ అభ్యర్థికి 2 లక్షల 83 వేల పైచిలుకు ఓట్లు పడ్డాయి.

Related posts

నాకు సీఎం పదవి ఆఫర్ చేశారు.. కానీ వద్దనుకున్నా: రాందేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు..

Ram Narayana

వందేభారత్ రైలు ప్రారంభోత్సవంలో ఆర్ఎస్ఎస్ గీతం… తీవ్రంగా స్పందించిన కేరళ సీఎం

Ram Narayana

ఎన్నికల్లో పోటీ చేయాలని మూడు రాజకీయ పార్టీలు నన్ను ఒత్తిడి చేస్తున్నాయి: ప్రకాశ్ రాజ్

Ram Narayana