తెలుగు రాష్ట్రాలు

ఫెంగల్ తుపాను ఎఫెక్ట్… తెలుగు రాష్ట్రాల నుంచి పలు విమాన సర్వీసులు రద్దు!

  • బంగాళాఖాతంలో ఫెంగల్ తుపాను
  • చెన్నైలో వరదలు… విమానాశ్రయం మూసివేత
  • విమానాల రాకపోకలకు ప్రతికూల వాతావరణం
  • ఏపీ, తెలంగాణ నుంచి పలు విమాన సర్వీసుల నిలిపివేత

బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను కారణంగా చెన్నై, తిరుపతి నగరాల్లో విమానాల రాకపోకలకు ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ నుంచి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన ఏడు విమానాలు రద్దు చేశారు. అదే సమయంలో, తిరుపతి నుంచి హైదరాబాద్ రావాల్సిన ఏడు విమానాలు కూడా రద్దయ్యాయి. 

అటు, చెన్నై నుంచి హైదరాబాద్ రావాల్సిన మూడు విమానాలు రద్దయ్యాయి. ముంబయి, ఢిల్లీ నుంచి చెన్నై వెళ్లాల్సిన రెండు విమానాలను దారి మళ్లించారు. చెన్నై-విశాఖ-చెన్నై, తిరుపతి-విశాఖ-తిరుపతి విమాన సర్వీసులు కూడా ప్రతికూల వాతావరణం కారణంగా నిలిచిపోయాయి. 

ఫెంగల్ తుపాను కారణంగా చెన్నైలో భారీ వర్షాలతో వరదలు ముంచెత్తాయి. దాంతో విమానాశ్రయాన్ని మూసివేశారు.

Related posts

తొలి తెలుగు టీవీ న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ కన్నుమూత

Ram Narayana

రెండు గంటల్లో శ్రీవారి దర్శనం… ఏఐ టెక్నాలజీని పరిశీలించిన టీటీడీ సభ్యులు…

Ram Narayana

ఆరేళ్ల తర్వాత కోర్టు మెట్లెక్కిన జగన్.. విచారణకు వ్యక్తిగతంగా హాజరు…

Ram Narayana