Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్లాట్‌ఫాం టికెట్‌తో రైలులో ప్రయాణం వార్తల్లో నిజం లేదు!

ప్లాట్‌ఫాం టికెట్‌తో రైలులో ప్రయాణం వార్తల్లో నిజం లేదు!
ప్లాట్‌ఫాం టికెట్‌తో రైలు ఎక్కేయొచ్చని వార్తలు
అలాంటి అవకాశమే లేదని స్పష్టీకరణ
ఆ తరహా ఉత్తర్వులేవీ జారీ కాలేదని వివరణ

ప్లాట్‌ఫాం టికెట్‌తో రైలు ఎక్కేయొచ్చని, ఆ తర్వాత టీటీఈ దగ్గరికెళ్లి కొంత మొత్తం జరిమానాతో ఎక్కడికంటే అక్కడికి ప్రయాణించొచ్చని, అవసరమైతే రిజర్వేషన్ కూడా అప్పటికప్పుడు పొందవచ్చంటూ వచ్చిన వార్తలపై దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని, ఇప్పటి వరకు అలాంటి ఉత్తర్వులేవీ జారీ చేయలేదని తెలిపింది.

రైల్వే బోర్డు నుంచి కానీ, జోనల్ రైల్వే ప్రధాన కార్యాలయం నుంచి కానీ ఇలాంటి ఉత్తర్వులేవీ జారీ కాలేదని స్పష్టం చేసింది. ప్లాట్‌ఫాం టికెట్‌తో రైలెక్కి టీటీఈ దగ్గర టికెట్ తీసుకునే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. ఇది ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై విచారణ జరుపుతున్నామని ,ఇలాంటి వార్తలవల్ల ప్రయాణికుల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి వార్తల అవసరమైతే నిర్దారించుకోవాలని తెలిపారు.ఎట్టి పరిస్థిత్లుల్లోనూ ప్లాట్ ఫామ్ టికెట్ తో రైలు ఎక్కడం కుదరదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు .

Related posts

దళిత బందు ఇవ్వడం చేతకాక ఈసీ డ్రామాలు :టీఆర్ యస్ పై బండి సంజయ్ ధ్వజం!

Drukpadam

తిరుమలలో ఎడతెరిపి లేని వర్షం… ఘాట్ రోడ్లపై విరిగిపడిన కొండచరియలు!

Drukpadam

కోడిపుంజుకు ఆర్టీసీ టికెట్ …స్పందించిన సజ్జనార్ …

Drukpadam

Leave a Comment