Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎలక్షన్ కమిషన్ వార్తలు

ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌లకు షెడ్యూల్ విడుద‌ల‌

  • ఫిబ్ర‌వ‌రి 3న ఎన్నిక‌లకు నోటిఫికేష‌న్ విడుద‌ల
  • ఫిబ్ర‌వ‌రి 27న పోలింగ్ 
  • మార్చి 3న చేప‌ట్ట‌నున్న ఓట్ల లెక్కింపు 
  • తెలుగు రాష్ట్రాల్లో మూడు చొప్పున ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నిక‌లు

ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌లకు షెడ్యూల్ విడుద‌లైంది. ఫిబ్ర‌వ‌రి 3న ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. ఫిబ్ర‌వ‌రి 27న పోలింగ్ ఉంటుంది. మార్చి 3న ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం షెడ్యూల్‌ను రిలీజ్ చేసింది. కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు చొప్పున ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. 

తెలంగాణ‌లో మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-క‌రీంన‌గ‌ర్ ఉపాధ్యాయ నియోజ‌క వ‌ర్గానికి ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. అదే స్థానంలో ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌నున్నాయి. వీటితో పాటు వ‌రంగ‌ల్‌-ఖ‌మ్మం-న‌ల్గొండ ఉపాధ్యాయ నియోజ‌కవ‌ర్గానికి కూడా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌నున్నారు. 

అటు ఏపీలో ఉమ్మ‌డి ఉభ‌య‌గోదావరి, కృష్ణా-గుంటూరు ప‌ట్ట‌భ‌ద్రుల నియోజ‌కవ‌ర్గాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అలాగే శ్రీకాకుళం-విజ‌య‌న‌గ‌రం-విశాఖ‌ప‌ట్నం ఉపాధ్యాయ నియోజ‌క వ‌ర్గానికి ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఈసీ షెడ్యూల్ విడుద‌ల చేసింది. 

Related posts

ముగిసిన సార్వత్రిక ఎన్నికల ఏడో దశ పోలింగ్…

Ram Narayana

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎంతమంది పోటీ చేస్తున్నారంటే?

Ram Narayana

లేటుగా వచ్చారని నామినేషన్ దాఖలుకు అనుమతి నిరాకరణ…

Ram Narayana

Leave a Comment