Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

హైదరాబాద్ లోని షర్మిల ఇంటి ముందు ఏపీ రైతుల మెరుపు ధర్నా…

హైదరాబాద్ లోని షర్మిల ఇంటి ముందు ఏపీ రైతుల మెరుపు ధర్నా
-కృష్ణ జలాల విషయంలో షర్మిల మాటలపై మండిపాటు
-కృష్ణా జలాలపై వైఖరి చెప్పాలని డిమాండ్
-వాగ్వాదానికి దిగిన షర్మిల మద్దతుదారులు
-రైతుల అరెస్ట్ పోలీస్ స్టేషన్ కు తరలింపు

వైయస్ షర్మిల ఇంటి ముందు ఏపీ రైతుల మెరుపు ధర్నా …. కంగు తిన్న షర్మిల మద్దతుదార్లు…ఆందోళనకారులతో వాగ్వివాదం …. పోలిసుల జోక్యం …రైతుల అరెస్ట్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలింపు … షర్మిల ను కృషాజాలాలపై వైఖరి చెప్పాలని రైతుల డిమాండ్ ….

హైదరాబాదులోని వైఎస్ షర్మిల ఇంటి ముందు ఏపీ రైతులు మెరుపు ధర్నాకు దిగారు. కృష్ణా నీళ్ల విషయంలో వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేస్తూ ఆమె ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో లోటస్ పాండ్ లోని షర్మిల నివాసం వద్ద స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.షర్మిల మద్దతు దార్లకు ఏపీ రైతులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది . తోపులాట వరకు వచ్చింది.దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరువురిని శాంతింప చేసేందుకు ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తతగా మారడంతో మెరుపు ధర్నాకు దిగిన ఆందోళన కారులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

తెలంగాణకు దక్కాల్సిన నీటిలో ఒక్క చుక్కనూ వదులుకోబోమని ఆమె ప్రకటించడంపై ఆంధ్రప్రదేశ్ రైతులు ఆగ్రహంతో ఉన్నారు. వైఎస్ షర్మిల వైఖరిని తప్పుపడుతున్నారు. తెలంగాణ ప్రయోజాల కోసం ఎవరినైనా ఎదిరిస్తానని ఆమె అన్న మాటలపై మండి పడుతున్నారు . ఆ వ్యాఖ్యలపై అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలోని రైతులు ఆమె ఇంటిని ముట్టడించేందుకు యత్నించగా.. షర్మిల మద్దతుదారులు అడ్డుకున్నారు. రైతులతో వాగ్వాదానికి దిగారు.

కృష్ణా నీళ్ల విషయంలో షర్మిల తన వైఖరేంటో స్పష్టంగా చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు. ఆమె వ్యాఖ్యలు రాయలసీమ రైతులకు నష్టం చేసేలా ఉన్నాయన్నారు. అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికపూడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసనకు దిగిన రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Related posts

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపండి: ఏపీకి కృష్ణా యాజమాన్య బోర్డు ఆదేశం

Drukpadam

రాజకీయాల్లో మార్పుకోసం పీకే పాదయాత్ర …జనం లేక వెలవెల …

Drukpadam

జైల్లో తన భర్త దేవినేని ఉమకు ప్రాణహాని : భార్య అనుపమ!

Drukpadam

Leave a Comment