జాతీయ వార్తలు

అరకు కాఫీకి జాతీయ ఖ్యాతి.. ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న జీసీసీ!

  • జీసీసీ అరకు వ్యాలీ కాఫీకి జాతీయ స్థాయిలో పురస్కారం
  • బిజినెస్ లైన్ ‘చేంజ్‌ మేకర్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2025’ అవార్డు
  • ఫైనాన్షియల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ విభాగంలో ఈ ప్రత్యేక గుర్తింపు
  • ముంబైలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు స్వీకరణ
  • గిరిజనుల గౌరవానికి ప్రతీకగా నిలిచిందన్న జీసీసీ ఎండీ
  • సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంతోనే సాధ్యమైందని వెల్లడి

ఏపీలోని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యంలో ఉత్పత్తి అవుతున్న అరకు వ్యాలీ కాఫీకి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. ప్రతిష్టాత్మక ‘బిజినెస్‌ లైన్‌’ చేంజ్‌ మేకర్‌ అవార్డ్స్‌-2025 కార్యక్రమంలో ‘ఫైనాన్షియల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌’ విభాగంలో ‘చేంజ్‌ మేకర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారాన్ని అరకు కాఫీ కైవసం చేసుకుంది. గిరిజనుల జీవితాల్లో ఆర్థిక మార్పునకు దోహదపడినందుకు గాను ఈ అవార్డును ప్రకటించారు.

ముంబైలో వైభవంగా జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి చేతుల మీదుగా జీసీసీ వైస్‌ చైర్‌పర్సన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కల్పనకుమారి ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అరకు కాఫీ కేవలం ఒక బ్రాండ్‌ మాత్రమే కాదని, అది గిరిజనుల ఆత్మగౌరవానికి, వారి శ్రమకు దక్కిన ప్రతీక అని పేర్కొన్నారు.

ఈ అద్భుతమైన విజయం వెనుక సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వం ఉందని కల్పనకుమారి తెలిపారు. ఆయన దార్శనికత, ప్రోత్సాహం వల్లే జీసీసీ ఈ స్థాయికి చేరుకోగలిగిందని ఆమె వివరించారు. ఈ అవార్డు తమ బాధ్యతను మరింత పెంచిందని, గిరిజన రైతుల అభ్యున్నతికి మరింతగా కృషి చేస్తామని స్పష్టం చేశారు.

Related posts

ఢిల్లీ ముఖ్యమంత్రిపై ఎఫ్ఐఆర్…

Ram Narayana

మోదీ నాకు మంచి మిత్రుడు.. రాహుల్ గాంధీకి ఆ అర్హత లేదు: అమెరికన్ గాయని మేరీ మిల్బెన్

Ram Narayana

ఆపరేషన్ సిందూర్ విజయవంతం: సైన్యానికి రాహుల్, ఖర్గే ప్రశంసలు!

Ram Narayana