Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

కూకట్ పల్లి ఏటీఎం దోపిడీదారులను అరెస్ట్ చేసిన పోలీసులు

కూకట్ పల్లి ఏటీఎం దోపిడీదారులను అరెస్ట్ చేసిన పోలీసులు
  • హైదరాబాదులో హెచ్ డీఎఫ్ సీ ఏటీఎం వద్ద కాల్పులు
  • సెక్యూరిటీ గార్డు మృతి
  • రూ.5 లక్షల నగదుతో దొంగల పరారీ
  • సంగారెడ్డి వద్ద అరెస్ట్ చేసిన ఎస్ఓటీ పోలీసులు
SOT Police arrests ATM robbers at Sangareddy

హైదరాబాదులో హెచ్ డీఎఫ్ సీ ఏటీఎం వద్ద కాల్పులకు పాల్పడి రూ.5 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మధ్యాహ్నం కూకట్ పల్లిలో ఏటీఎం వద్ద కాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపింది. ఏటీఎంలో డబ్బులు నింపుతున్న వారిపై ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి నగదుతో బైక్ పై పరారయ్యారు. దుండగుల కాల్పుల్లో సెక్యూరిటీ గార్డు అలీ ప్రాణాలు విడిచాడు.

ఈ ఘటనను సవాల్ గా తీసుకున్న పోలీసులు కొన్ని గంటల్లోనే దోపిడీదారులను పట్టుకున్నారు. సంగారెడ్డి వద్ద వారిని సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 15 రోజుల క్రితం జీడిమెట్లలో బ్యాంకు దోపిడీకి పాల్పడింది వీరి ముఠానే అని పోలీసులు గుర్తించారు.

Related posts

ఖర్గే హత్య కుట్రపై విచారణ జరుపుతాం: కర్ణాటక సీఎం బొమ్మై!

Drukpadam

యూపీలోని లఖింపూర్ ఖేరి జిల్లాలో దారుణం.. అక్కాచెల్లెళ్లను అపహరించి అత్యాచారం.. ఆపై హత్య!

Drukpadam

ఆస్తిలో వాటా ఇవ్వలేదని తండ్రిని కారుతో ఢీకొట్టి చంపిన తనయుడు…

Ram Narayana

Leave a Comment