ఆంధ్రప్రదేశ్

ప్రధానిమోడీ తల్లికి అస్వస్థత ..త్వరగా కోలుకోవాలన్న రాహుల్ గాంధీ !

మోదీ గారు! ఈ కష్ట సమయంలో మీకు నా ప్రేమ, మద్దతు ఉంటాయి: రాహుల్ గాంధీ

  • అస్వస్థతకు గురైన మోదీ తల్లి హీరాబెన్
  • తల్లీకొడుకుల మధ్య అనుబంధం వెలకట్టలేనిదన్న రాహుల్
  • మీ తల్లి త్వరగా కోలుకుంటారన్న కాంగ్రెస్ అగ్రనేత 

ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసర్చ్ సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు బులెటిన్ ద్వారా వెల్లడించారు. అయితే, అనారోగ్యానికి గల కారణాలను మాత్రం వారు వెల్లడించలేదు. మరోవైపు ఈ బాధాకరమైన సమయంలో ప్రధాని మోదీకి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అండగా నిలిచారు.

ట్విట్టర్ ద్వారా రాహుల్ స్పందిస్తూ… తల్లీకొడుకుల మధ్య అనుబంధం అన్నిటికీ అతీతమైనదని, వెలకట్టలేనిదని చెప్పారు. మోదీ గారూ, ఈ కష్ట సమయంలో మీకు నా ప్రేమ, మద్దతు వుంటాయని అన్నారు. మీ మాతృమూర్తి త్వరగా కోలుకుంటారని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. మరోవైపు ఇటీవలే హీరాబెన్ 99వ పుట్టినరోజును జరుపుకోవడం విశేషం.

Related posts

విజయనగరం రైలు ప్రమాదంలో 14కు పెరిగిన మృతుల సంఖ్య

Ram Narayana

మూడు నెలల్లో ఆరు పెళ్లిళ్లు చేసుకున్న కిలాడీ భామ!

Drukpadam

ప్రాణాలమీదకు తెచ్చుకున్న జిలుగు కల్లు: ఏపీలో కల్తీ కల్లు తాగి ఐదుగురి మృతి!

Drukpadam