Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

మా బాధ్యత ఇంకా ముగియలేదు: రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్!

మా బాధ్యత ఇంకా ముగియలేదు: రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్!

  • తప్పిపోయిన వారిని కుటుంబ సభ్యులు గుర్తించేలా సాయం అందిస్తామని ప్రకటన
  • ప్రమాద స్థలం వద్దే ఉండి పనులను పర్యవేక్షిస్తున్న మంత్రి
  • రెండు రోజుల్లో ట్రాక్ పునరుద్ధరణ పూర్తి

ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో ఘోర రైలు ప్రమాద ఘటనపై ఆ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ భావోద్వేగంగా స్పందించారు. గత శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో 275 మంది మరణించగా, 1,000 మందికి పైగా గాయపడడం తెలిసిందే. మృతుల్లో ఇంకా అధిక శాతం మందిని గుర్తించలేని పరిస్థితి నెలకొంది. రెండు రోజులుగా ప్రమాద స్థలం వద్దే ఉంటూ సహాయక, పునరుద్ధరణ సేవలను మంత్రి పర్యవేక్షిస్తున్నారు. దెబ్బతిన్న రైలు మార్గాన్ని పునరుద్ధరించి తిరిగి రైలు సర్వీసులను ప్రారంభించినట్టు మంత్రి ప్రకటించారు.

అయితే, ఇంతటితో తమ బాధ్యత ముగిసినట్టు కాదన్నారు. తప్పిపోయిన వ్యక్తులను ఆందోళన చెందుతున్న వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చడంపై దృష్టి పెడతామని తెలిపారు. మా లక్ష్యం తప్పిపోయిన వారిని వారి కుటుంబ సభ్యులు వేగంగా గుర్తించేలా చేయడమే. మా బాధ్యత ఇంకా పూర్తి కాలేదు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ సిస్టమ్ లో ఉద్దేశపూర్వకంగా చేసిన మార్పుతోనే ఘోర ప్రమాదం జరిగినట్టు మంత్రి ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. ప్రమాదానికి బాధ్యులను సైతం గుర్తించినట్టు చెప్పారు. రైల్వే సేఫ్టీ కమిషనర్, సీబీఐ దర్యాప్తులో నిజాలు వెలుగు చూడనున్నాయి.

51 గంటల్లోనే బాలాసోర్‌‌ ట్రాక్ పునరుద్ధరణ.. పట్టాలపైకి తొలి రైలు

  • ప్రమాదంలో ధ్వంసమైన రెండు ట్రాక్‌లను సరిచేసిన అధికారులు
  • దగ్గరుండి పనులు పర్యవేక్షించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
  • 275 మందిని పొట్టనపెట్టుకున్న ఘోర ప్రమాదం
First train movement after 51 hours on track where Odisha tragedy took place

ఒడిశా ఘోర రైలు ప్రమాదం జరిగిన బాలాసోర్‌‌లో రైళ్ల రాకపోకలు తిరిగి ప్రారంభమయ్యాయి. ట్రాక్ ను సరి చేసి రైల్వే సేవలు తిరిగి పునరుద్ధరించారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రమాదం జరిగినప్పటి నుంచి ఘటనాస్థలంలోనే వుండి పునరుద్ధరణ పనులు పర్యవేక్షించారు. వెయ్యిమంది కూలీలు, భారీగా యంత్రాలు ఉపయోగించి, యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేశారు. పూర్తిగా ధ్వంసమైన రెండు ట్రాక్‌లను కేవలం 51 గంటల్లోనే తిరిగి పునరుద్ధరించారు.

పునరుద్ధరించిన ట్రాక్‌పై గూడ్స్ రైలు వెళ్తుండగా తీసిన వీడియోను వైష్ణవ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ట్రాక్ పై గ్రూడ్స్ రైలు వెళ్తున్న సమయంలో ఆయన రెండు జోతులు జోడించి నమస్కరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆదివారం సాయంత్రం తొలి రైలు ట్రాక్‌లపై నడిచిందని ట్వీట్ చేశారు. కాగా, దేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఈ రైల్వే ప్రమాదంలో 275 మంది మృతి చెందారు. 1100 మంది వరకు గాయపడ్డారు.

Related posts

ఏఐసీసీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి …

Ram Narayana

నేవీలోకి 2 యుద్ధ నౌకలు, ఒక జలాంతర్గామి!

Ram Narayana

కొన్ని రకాల బంగారు ఆభరణాలు, వస్తువుల దిగుమతికి కేంద్రం నూతన విధానం!

Drukpadam

Leave a Comment