హైద్రాబాద్ వార్తలు

రేపటి నుంచి నెహ్రు ఓ ఆర్ ఆర్ పై టోల్ బాదుడు ….

  • రేపటి నుంచి అమల్లోకి రానున్న పెరిగిన ఛార్జీలు
  • కిలోమీటరుకు 10 పైసల నుంచి 70 పైసల వరకు పెంపు
  • ఓఆర్ఆర్‌పై టోల్ వసూలు చేస్తోన్న ఐఆర్బీ ఇన్ఫ్రా

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలు పెరగనున్నాయి. వివిధ వాహనాలకు కిలోమీటరుకు 10 పైసల నుంచి 70 పైసల వరకు ఛార్జీలు పెరిగాయి. కారు, జీపు, లైట్ మోటార్ వాహనాలకు కిలోమీటరుకు 10 పైసలు పెంచారు. దీంతో ప్రస్తుతం ఉన్న ఛార్జీ రూ.2.34 నుంచి రూ.2.44కు పెరిగింది.

మినీ బస్ మరియు ఎల్‌సీవీలకు 20 పైసలు పెంచారు. ఈ వాహనాలకు కిలోమీటరుకు ఛార్జీ రూ.3.77 నుంచి రూ.3.94కు పెరుగుతుంది. డబుల్ యాక్సిల్ బస్సులకు కిలోమీటరుకు రూ.6.69 నుంచి రూ.7కు పెంచారు. భారీ వాహనాలకు రూ.15.09 నుంచి రూ.15.78కి పెంచారు. 

ఓఆర్ఆర్ పై ఐఆర్బీ ఇన్‌ఫ్రా సంస్థ టోల్ వసూలు చేస్తోంది. పెరిగిన ఛార్జీలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయి. 

Related posts

డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ యువకుడు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్య

Ram Narayana

తన ఇంటిపై వస్తున్న వార్తల పట్ల క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Ram Narayana

గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం… ఇద్దరు ఏపీ యువకుల మృతి

Ram Narayana