Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలురాజకీయ వార్తలు

పొంగులేటి అనుచరుల శవాలు కూడా మిగలవు: ఖమ్మంలో కలకలం రేపుతున్న పోస్టర్లు

  • పొంగులేటిని టార్గెట్ చేస్తూ ఖమ్మంలో పోస్టర్లు
  • పువ్వాడపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరికలు
  • పోస్టర్లపై ఇంకా స్పందించని పొంగులేటి

తెలంగాణ శాసనసభకు ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. రోజురోజుకూ మలుపులు తిరుగుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠను రేపుతున్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 

మరోవైపు రాష్ట్రంలో ఖమ్మం జిల్లా రాజకీయాలు మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి బహిష్కృతులైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీపై ఆయన నిప్పులు చెరుగుతున్నారు. కేసీఆర్ ను గద్దె దించడమే తన లక్ష్యమని చెపుతున్నారు. 

ఈ క్రమంలో పొంగులేటికి వార్నింగ్ ఇస్తూ ఖమ్మంలో పోస్టర్లు వెలిశాయి. పొంగులేటి అనుచరుల శవాలు కూడా మిగలవంటూ పోస్టర్లలో హెచ్చరికలు జారీ చేశారు. బీఆర్ఎస్ పై, మంత్రి పువ్వాడ అజయ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్లు ఖమ్మంలో కలకలం రేపుతున్నాయి. ఈ పోస్టర్లపై పొంగులేటి ఇంకా స్పందించాల్సి ఉంది.

Related posts

మోదీ హత్యకు కాంగ్రెస్ కుట్ర.. పంజాబ్ సీఎంను అరెస్ట్ చేయండి: అసోం సీఎం డిమాండ్!

Drukpadam

తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రులకు జగన్ లేఖలు : సోము వీర్రాజు ఫైర్…

Drukpadam

అమెరికా అధ్యక్షుడు బైడెన్-కమలా హారిస్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయా?

Drukpadam

Leave a Comment